Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TG ICET: టీజీ ఐసెట్ 2025 పారదర్శకతకు అధునాతన సాంకేతికత –కన్వీనర్ ఆచార్య అల్వాల రవి

TG ICET : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్లగొండ ఆధ్వర్యంలో, తెలంగాణ ఉన్నత వి ద్యా మండలి ఆదేశానుసారం నిర్వ హించనున్న టి జి ఐసెట్ 2025 అ త్యంత పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అధునాతన సాంకేతికతను వినియోగించనున్న ట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఎంబీఏ మరియు ఎంసీ ఏలో అడ్మిషన్ కొరకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షను జూన్ 8 మరి యు 9వ తేదీల్లో నిర్వహించనున్న ట్లు తెలిపారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్షను జూ న్ 8న ఉదయం పది గంటల నుం డి 12:30 వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు రెండో విడత, జూన్ 9న 10: 00 నుండి 12:30 వరకు మొదటి విడతల్లో నిర్వహించనున్నట్లు ఆ యన తెలిపారు. తెలంగాణ వ్యా ప్తంగా 16 జోన్లు, మొత్తం 96 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వ హించను న్నారు. మొత్తం 71 757 మంది అ భ్యర్థుల్లో, స్త్రీలు అత్యధి కంగా 37, 331, పురుషులు 344 09, 17 ట్రా న్స్ జెండర్ అభ్యర్థులు పరీక్షకు హా జరుకానున్నారు.

పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల సంఖ్యను బట్టి ఒకరు లేదా ఇద్దరు సీనియర్ అధ్యా పకులు పర్యవేక్షించనున్న ట్లు ఆ యన తెలిపారు. హాల్ టికె ట్లను టీజీ ఐసెట్ అధికారిక వెబ్సై ట్ నుం చి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. హాల్ టికెట్లు పొందుపరిచిన క్యూఆర్ కోడ్ ద్వా రా అభ్యర్థులు తమ తమ పరీక్ష కేంద్రాలకు సులువుగా చేరుకోవ చ్చునని తెలిపారు. అభ్యర్థులు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరు కోవాలని, పరీక్ష ప్రారంభానికి 15 ని మిషాల నియమాన్ని పాటించను న్నట్లు, ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించబోనట్లు ఆయన తె లిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు ప్రభుత్వo ఆ మో దించిన ఏదైనా ఐడి కార్డును తమ వెంట తెచ్చుకోవాలని సూచించా రు. హాల్ టికెట్ లో పరీక్ష యొక్క సూచనలను అభ్యర్థులు విధిగా పా టించాలని సూచించారు.