— వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు
MLA Gopinath: ప్రజా దీవెన, హైదరాబాద్: జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన ఆది వా రం ఉదయం 5.40 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడిన గోపీనాథ్ను కుటుంబ సభ్యులు గ చ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. అప్పటి నుంచి హాస్పి టల్లోనే చికిత్స పొందుతున్నారు.
కార్డియాక్ అరెస్టు కావడం, సీపీ ఆర్తో తిరిగి గుండె కొట్టుకోవ డం తో పాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా, అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉద యంకన్నుమూశారు.మాగంటి గో పీనాథ్ 2014, 2018, 2023 శాస నసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియో జకవర్గం నుంచి వరుసగా గెలు పొందారు.
మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్పై 9 వేలకుపైగా ఓట్ల ఆధి క్యంతో తొలిసారే విజయాన్ని రుచి చూశారు.ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అ భ్యర్థి పీ.విష్ణువర్ధన్రెడ్డిపై విజయం సాధించారు.గత ఎన్నికల్లోనూ మ రోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై గెలిచి హ్యాట్రిక్ సాధించారు.