–పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి
–పెద్దసూరారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Gummala Mohan Reddy: ప్రజాదీవెన నల్గొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మండలంలోని పెద్ద సూరారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం గ్రామంలో రూ.7లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు,మురుగు కాలువల నిర్మాణానికి, రూ.10 లక్షల వ్యయంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్డు పనులకు నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని స్పష్టం చేశారు. పెద్దసూరారం గ్రామంలో అన్ని కాలనీలలో సిసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దరం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి పలువురి లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేశారు.
గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెండెం రత్నమాల పాండు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి యాదగిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏడుదొడ్ల వెంకట్ రామ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తంతెనపల్లి రామలింగం, ఏడుదొడ్ల కొండల్ రెడ్డి, ఏడుదొడ్ల కృష్ణారెడ్డి, గుండె వెంకన్న, ముసుకు బిక్షం, కోట్ల జలంధర్ రెడ్డి, ఎర్రమాద మోహన్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.