— గురుకుల కళాశాల గోడ ప్రతిని ఆవిష్కరించిన కలెక్టర్
ప్రజాదీవెన నల్గొండ
Collector Ila Tripathi: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల, చర్లపల్లి, నల్లగొండ కళాశాల యందు 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం కావడం జరిగింది. ఇందుకు సంబంధించిన గోడ ప్రతిని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఆవిష్కరించారు. అర్హులైన మహిళా విద్యార్థులు జూన్ 23 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అందుబాటులో ఉన్న కోర్సులు బీఎస్సీ ( బిజెడ్సి, ఎంజెడ్సి, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, ఏంఎస్డిఎస్), బీకాం (బిఏ, సీఏ), బిఏ (హెచ్ఈపి), దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదవతరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ,5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటుగా జనవరి 2025 తర్వాత పొందిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రం ( గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000 లోపు పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 2 లక్షల రూపాయల లోపు ఉండాలి).
ఈ దరఖాస్తులను జత చేసి నేరుగా జూన్ 23 లోపు కళాశాలలో అందజేయాలని కలెక్టర్ తెలిపారు. గోడ ప్రతి ఆవిష్కరణలో హౌసింగ్ పీడీ ఎస్పీ రాజ్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పవిత్ర వాణికర్ష, కళాశాల అడ్మిషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.