Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: ఏపీ జలదోపిడీపై హరీశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ప్రజా దీవెన, హైదరాబాద్:

Harish Rao: ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ కుట్రలపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శనివారం సాయంత్రం పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. “బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న జల దోపిడీ కుట్రలు” అనే అంశంపై ఆర్థిక, సాగునీటి పారుదల, వైద్యారోగ్య శాఖల మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్,చింత ప్రభాకర్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,పాడి కౌశిక్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చంటి క్రాంతికిరణ్, డాక్టర్ మెతుకు ఆనంద్, గొంగిడి సునీత,బీఆర్ఎస్ నాయకులు వీ.దేవీప్రసాద్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్,తుల ఉమ, చిరు మల్ల రాకేష్,కోతి కిశోర్ గౌడ్, ఉపేం ద్రాచారి,గెల్లు శ్రీనివాస్ యాదవ్, వై.సతీష్ రెడ్డి,సోమ భరత్ కుమా ర్,గోసుల శ్రీనివాస్ యాదవ్, ధర్మేం దర్ రెడ్డి,మన్నె గోవర్థన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.