ప్రజా దీవెన, హనుమకొండ:
CPI MLA Kunamneni: కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులను లేకుండా చేయాలని కలలు కంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడు తోందని, పోలీసుల కాల్పుల్లో చని పోయిన నంబాల కేశవరావు మృత దేహాన్ని ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. మావోయిస్టులు తప్పు చేస్తే చట్ట ప్రకారం కేసులు పెట్టాలని, 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఒక ఫ్యూడల్, గూండా, ఫాసిస్ట్ పాలనకు నిదర్శనం అని అన్నారు. మావోయిస్టులు లొంగిపోతామన్నా, చర్చలకు సిద్దం అని ప్రకటించినా హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ ఒక్క నంబాల కేశవరావును చంపితే దేశంలో కోట్లాది మంది స్పందించారని, అదీ కమ్యూనిస్టులకు ఉన్న మానవతావాదానికి నిదర్శనమన్నారు.
తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి
కూనంనేని మాట్లాడుతూ 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేశారు. అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే అన్ని జిల్లా లకు సాగునీరు అందేదని చెప్పారు. కాళేశ్వరం నిర్మించాక ఒక చుక్కనీ రు అదనంగా ఇవ్వలేదని, నేడు పం టలకు వచ్చేవి ఎల్లంపల్లి నీళ్లేనని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించి న కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ప్రజలపై భారం మోపే కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని అన్నా రు. దాని నిర్వహణ కోసం ఏటా వేల కోట్ల రూపాయల ప్రజల సొ మ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖ ర్చు చేయొద్దని సూచించారు. కేసీ ఆర్ అంటే కాళేశ్వరo కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నేడు నోరు మూసుకున్నారని, తన మెదడును కరిగించి డిజైన్ చేశానని, కాళేశ్వరం కు అన్నీ తానే అన్న కేసీఆర్ ఇప్పు డు తనకు సంబంధం లేదంటున్నా రని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ బాధ్యత ఇంజనీర్ లదే అని నేడు తప్పించు కుంటున్నారని, ఇది అన్యాయమని అన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నిర్మిం చాల్సిన ప్రాజెక్టును మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదని, అందుకే కాళేశ్వరం కు మార్చామని హరీశ్ రావు అంటున్నారని, అలా అని జ నాలను ముంచే ప్రాజెక్టు కడతారా అని ప్రశ్నించారు.భారతదేశం ఆర్ధి కంగా జపాన్ ను దాటి నాల్గవ స్థా నం ఆక్రమించిందని కేంద్ర సర్కార్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ ప్రజ లను మభ్య పెడుతుందని, కృత్రి మంగా పేదలు లేని దేశంగా చూ పాలని ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమ ర్శించారు. అర్థికంగా దేశం అభివృ ద్ధి చెందితే అసమానతలు ఎందుకు పోలేదని, ప్రజలు పేదరికంలో ఎం దుకు మగ్గుతున్నారని ప్రశ్నించారు. ప్రతిరోజు రూ.280ల నుండి రూ.3 20లు సంపాదిస్తే పేదలు ధనవంతు లుగా ఎలా మారుతారని ప్రశ్నించా రు. నెలకు రూ.8వేలకు కుటుంబా న్ని ఎలా పోషించుకుంటారన్నారు.
నెలకు 20వేల రూపాయల ఆదా యం ఉన్నా పేదవారుగానే పరిగ ణించాలని అన్నారు. బతుకుదెరు వు లేకుండా అర్థాకలితో ప్రజలు జీ వనం సాగిస్తున్నారని, ప్రపంచ దే శాలో ఆకలితో అలమటిస్తున్న వారి లో దేశం 101 స్థానంలో నిలిచింద ని, ప్రజలకు విద్య, వైద్యం కల్పించ టంలో, కొనుగోలు శక్తిలో 124 స్థా నంలో నిలిచినట్లు సూచికలు తెలు పుతున్నాయన్నారు. కేంద్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేం దు కు, వాస్తవాలను మరుగునపడేసేం దుకు తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లప ల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జి ల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరు ణాకర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆ దరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జి ల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.