World Blood Donor Day: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే ను శుక్ర వారం హైదరాబాదు రాజ్ భవన్ లో గవర్నర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ని ర్మాణాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాం పులు నిర్వహించిన వారిని ఘనం గా సత్కరించారు. అదే విధంగా జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కి 20 00 పైగా బ్లడ్ క్యాంప్ నిర్వహించిన చౌటుప్పల్ యాజమాన్యాన్ని ఘ నంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అ ధ్యక్షులు ఇలా త్రిపాఠి సూచనతో న ల్గొండ రెడ్ క్రాస్ చేస్తున్న వివిధ సా మాజిక సేవ కార్యక్రమాల మరియు యూత్ రెడ్ క్రాస్ ద్వారా చేస్తున్న సేవలను వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా గవర్నర్ చైర్మన్ జిల్లా మేనేజింగ్ కమిటీనీ యూత్ వాలంటీర్స్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ దాన కి షోర్ స్టేట్ జనరల్ సెక్రెటరీ శ్రీరాము లు స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ మందడి నర్సిరెడ్డి జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రె డ్డి శ్రీనివాస్ రెడ్డి మేనేజింగ్ కమిటీ సభ్యులు సూరెడ్డి సరస్వతి బుక్క ఈశ్వరయ్య జిల్లా దశరధ ఊరుకొం డ ప్రభాకర్ రెడ్డి కంబపాటి కోటేశ్వర రావు డాక్టర్ సుచరిత గవర్నర్ అభి నందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.