ప్రజా దీవెన, కోదాడ:
Ahmedabad Plane Crash: పట్టణములో స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం జరిగే ఆరాధనలో పాస్టర్ ఏసయ్య ఆధ్వర్యంలో అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వారికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ..
విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల ఆత్మలకు ప్రభువైన యేసుక్రీస్తు శాంతి చేకూర్చాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినామని తెలిపారు మృతుల కుటుంబాలకు దేవుడు ఆదరణ ఓదార్పు ఇవ్వాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు.
ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలని మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని తగు సహాయం చేయాలని కోరారు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులు జగ్గు నాయక్ భాగ్యశ్రీ చార విజయనంద్ మోజేషు పోయిల సైదులు, రాంబాబు, గురునాథ్, నాగరాజు, రామకృష్ణ, ద్రాక్షావల్లి, రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు