Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJYM Leader Ajayడీఈఓ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ జరిపించాలి

–బీజేవైఎం నాయకులు అజయ్

ప్రజాదీవెన, నల్గొండ:
BJYM Leader Ajay: అనేక అక్రమాలకు పాల్పడుతున్న డీఈవో బొల్లారం బిక్షపతి పై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతూ బీజేవైఎం నాయకుడు నేరెళ్ల అజయ్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు. ఆరేళ్లుగా జిల్లా డీఈవోగా పనిచేస్తున్న బిక్షపతి తన ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు వేశాడని, డీఈఓ కార్యాలయంలో తన అనుచరులతో అక్రమాలకు పాల్పడుతున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

జిల్లాలోని కేజీబీవీల ఎస్ఓల నుండి నెల నెలా ముడుపులు తీసుకుంటున్నాడని అజయ్ ఆరోపించారు. డిఈఓ చేసిన అక్రమాలపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. డిఈఓ అక్రమాలపై బహిరంగ విచారణ జరిపిస్తే తాము ఋజువులు చూపిస్తామని పేర్కొన్నారు.