–స్వచ్ఛంద సంస్థలకు ఇస్తామన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
–ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్
ప్రజాదీవెన నల్గొండ:
Collector Ila Tripathi: రాష్ట్రంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో ఇంటర్మీడియట్ చదివేందుకు అవకాశం కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..
గతంలో గురుకులాలలో ఇంటర్ ప్రవేశాలకు ఇంట్రన్స్ పరీక్ష నిర్వహించేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం అలాంటి టెస్ట్ నిర్వహించకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని చెప్పడంతో చాలా మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు విషయం తెలియక వారు ఆన్లైన్లో దరఖాస్తు చేయలేదని అన్నారు. గురుకులాల్లో కళాశాల అడ్మిషన్ల కోసం గురుకులాల చుట్టూ, ఆర్ సి ఓ కార్యాలయం చుట్టూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదే పదే తిరుగుతున్నారని తెలిపారు.
విషయంపై ఆర్సిఓలు పై అధికారుల నుండి ఎలాంటి డైరెక్షన్లు రాలేదని పేర్కొంటున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు గురుకులలలో కళాశాల సీటు అందరి ద్రాక్షగా తయారైందని ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి అన్ని గురుకులాలలో పదో తరగతి విద్యార్థుల మెరిట్ ఆధారంగా విద్యార్థులకు కావలసిన గ్రూపులలో అడ్మిషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం నుండి తప్పించుకోవడం కోసం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వచ్ఛంద సంస్థలకు అప్పచెబుతామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.