Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Upland Paddy Cultivationమెట్ట వరి సాగులో మెలకువలపై రైతులకు అవగాహన

Upland Paddy Cultivation: శాలిగౌరారం: మెట్ట వరి సాగులో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందడడానికి రైతులు అవగాహన పెంచుకోవాలని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నల్లగొండ ఏరియా మేనేజర్ రుద్రాక్షి సతీష్ అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామ శివారులో దొంగరి సైదులు వ్యవసాయ క్షేత్రంలో వ్రీధి ఇంపాక్ట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెట్ట వరి సాగులో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్బంగా మేనేజర్ రుద్రాక్షి సతీష్ మాట్లాడుతూ నూతన వరి వంగడంను ” మల్టీ క్రాఫ్ ప్లాన్ ట్టర్” కొనుగోలు చేసిన రైతు దొంగరి సైదులు మెట్ట పద్ధతిలో డ్రిల్ సాయం వరి విత్తనాలను ఎద పెట్టి నాటారన్నారు.పొలాన్ని బురద చేసి 3 లేదా 4 సార్లు దుక్కిదున్నాలని గొర్రు కొట్టనవసరం లేదన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణం పరిస్థితులను బట్టి రైతులు వ్యవసాయ ఆధునీకరణ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ సుల్తాన్ వెంకన్న,జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ సాలం నరేష్, బందెల ఉదయ్, రైతుల మోదాలసాంబయ్య,దేవనబోయిన సైదులు,రావుల భాస్కర్,కప్పల సైదులు,కుర్ర రమణమ్మ,కుర్ర లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.