Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Kavitha: బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి

–బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లకై జులై 17న భారీ రైల్‌రోకో
–కామారెడ్డి డిక్లరేషన్ సాధించే వరకు పోరాడుతాo
–బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రజాదీవెన, మెదక్:
MLC Kavitha: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు సాధించు కుం టామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డి‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల సమయంలో ప్రకటించిన డిక్లరేషన్ సాధించే వరకు పోరాడుతామని అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగ బద్దంగా 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది రాజకీయ వేదిక కాదు, మానవ హక్కుల వేదిక అని చెప్పారు. విద్యకు, ఉద్యోగాలకు, రాజకీయాలకు వేర్వేరుగా రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ బిల్లు పంపామని తమకు ఏం సంబంధం లేదనేలా కాంగ్రెస్ నేతలు అనడం సరికాదని చెప్పారు.

బీజేపీ ఎంపీ రఘునందన్‌ రా వు ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారా అని ప్రశ్నించారు. బీసీ బిల్లు వస్తే ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, నిధులు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినకు లగణనలో చిత్తశుద్ధి లేదని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. బీసీ బిల్లు సాధ కు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావడానికి జులై 17వ తేదీన రైల్‌రోకో చేపడతామని ప్రకటించారు.

బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్‌ల అంశం తేలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామనడం సరికాదని అన్నారు. బీసీలకు రిజర్వేషన్‌లు ఇవ్వ కుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆపుతామని చెప్పారు. అందరూ ఏకతాటి పైకి వచ్చి పోరాడితే బీసీ బిడ్డల కాళ్ల వద్దకు పదవులు వస్తాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.