శాలిగౌరారం:
MEO Saidulu: అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని శాలిగౌరారం మండల విద్యాధికారి మందుల సైదులు అన్నారు. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం గంట మ్రోగించి పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంఈఓ సైదులు మాట్లాడుతూ.. పిల్లలను క్రమం తప్పకుండ కేంద్రాలకు పంపించాలని, గర్భిణీలు, బాలేంతలు కూడా వచ్చి పౌష్టికాహారం తీసుకోని ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి వెంకన్న, ఉపాధ్యాయులు సిహెచ్ నర్షయ్య, ఐసీడీస్ సూపర్ వైజర్ జ్యోతి,అంగన్వాడీ టీచర్లు తరాల శోభారాణి,జి.లలిత,కె. వసంత,ఎస్. అనిత ఆయాలు తల్లులు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు.