Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

School Building: కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

–బిల్లులు చెల్లించడంలేదని పెట్రోల్ పోసుకొని హల్చల్

ప్రజాదీవెన నిర్మల్:
School Building: తాను నిర్మించిన స్కూలుభవనానికి బిల్లులు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా ఖనాపూర్ మండలం రాజూర గ్రామా నికి చెందిన గడ్డం శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్, అదే గ్రామంలో రూ.37 లక్షలతో పాఠశాల భవనం నిర్మించాడు. రూ.14 లక్షలు విడుదల చేసి, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా డబ్బు గత ప్రభుత్వం విడుదల చేయలేదు.

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా బిల్లు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి కాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తుల చొరవతో ఆందోళన విరమించి, వారం రోజుల్లో తనకు బిల్లు మంజూరు చేయకపోతే పాఠశాల భవనానికి తాళం వేస్తానని స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరించాడు సదర్ కాంట్రాక్టర్.