Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CITU : అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:

CITU : కార్పెంటర్ షాపులపై అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ పట్టణ అధ్యక్షుడు సలివోజు సైదాచారి కోరారు. మంగళవారం తెలంగాణ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాణికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పెంటర్ షాపు దగ్గరకు అటవి శాఖ అధికారులు దాడులు చేసి షాపులో వేప తుమ్మ కలప నిలువ ఉండవద్దని ఉంటే సీజ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కార్పెంటర్ షాపు యజమాని ఒకటి రెండు భవనాలకు సరిపడా కలప షాపులలో నిల్వ ఉంచుకోవడం సహజంగానే జరుగుతుందని అన్నారు.

ఇంటి యజమానులు దర్వాజా తలుపులు కిటికీలు చేయించుకోవడానికి కొంత కలప షాపులో పెడుతుంటారని అన్నారు. కార్పెంటర్ షాపులపై అటవి శాఖాధికారులు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయవద్దని జిల్లా అటవీశాఖ అధికారికి విజ్ఞప్తి చేశారు. అక్రమ కలప రవాణా జరిగితే తనిఖీలు చేయడంకు ఎలాంటి అభ్యంతరం లేదని షాపులపై దాడులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

అటవీశాఖ అధికారులు కార్పెంటర్ షాపులపై దాడులు ఆపకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, అవుట రవీందర్ , తెలంగాణ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పట్టణ సహాయ కార్యదర్శి గడగోజు సైదా చారి కమిటీ సభ్యులు బత్తినోజు సైదాచారి, తదితరులు పాల్గొన్నారు.