*అభివృద్దే ఆశయంగా నియోజక వర్గమే కుటుంబంగా చూసుకుంటున్న ఎమ్మెల్యే
*భవిష్యత్తు లో ఎమ్మెల్యే పద్మావతి ఉన్నత పదవులు చేపట్టాలి: భాస్కర్
ప్రజా దీవెన, కోదాడ:
MLA Padmavathi Birthday: నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ తోనే సాధ్యం అని తెలంగాణ రాష్ట్ర ముదిరాజుల సంఘం రాష్ట్ర నాయకులు బాసిపోయిన భాస్కర్, నియోజకవర్గ కన్వీనర్ ముసి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణం లోని స్థానిక శనగల రాధాకృష్ణ దివ్యాంగుల ఆశ్రమంలో దివ్యాంగుల మధ్య ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్దే ఆశయంగా,నియోజక వర్గ ప్రజలే కుటుంబంగా చూసుకుంటున్న నాయకురాలు ఉత్తం పద్మావతి అన్నారు. వేల కోట్ల రూపాయలు నిధులను నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కు అండగా ఉంటామన్నారు.
ప్రజల సంక్షేమం కోసం అన్నింటినీ త్యాగం చేసి నిరంతరం ప్రజల కోసం తపిస్తున్న నాయకులు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా దివ్యాంగులకు పండ్లు అల్పాహారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం నాయకులు అల్లి వీరబాబు, ముని మట్టయ్య సాగర్ల నాగేశ్వరరావు, చిలక రమేష్ ,లక్ష్మయ్య ,వేముల సురేష్, నర్సింగరావు, సత్యనారాయణ, కే రామారావు, నాయని మల్లయ్య, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.