–జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఛత్రు
ప్రజాదీవెన నల్గొండ:
UPSC Coaching: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖచే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2026 కోసం తెలంగాణ రాష్ట్ర యస్టి, యస్సి, బిసి అభ్యర్థులకు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల గిరిజన ఐఏయస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన తెలంగాణ రాష్ట్ర యస్టి, ఎస్సీ, బీసీ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఛత్రు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్ధులను ఆబ్జెక్టివ్ టైపు ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలు మించరాదని, అభ్యర్ధులు http://studycircle.gov.in ద్వారా జూలై 4వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని విరవాలకు 6281766534 ను అన్ని పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 లోపు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.