ప్రజా దీవెన, చింతూరు:
Maoists Encounter: అల్లూరి సీతారామ రాజు రంపచోడవరం మన్యంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. గత రెండు నెలల క్రితం రంప చోడవరం నియోజకవర్గం వై రామవరం, కొయ్యూరు మండలాల సరి హద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఏఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయి స్టులు మృతి చెందగా మన్యంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు లు మృతి చెందినట్లు సమాచారం.
రంపచోడవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోని దేవిపట్నం, రంపచోడవ రం మండలాల సరిహద్దులోని దేవీ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కా కావాడగండి గ్రామ సమీపంలో గల కిట్టూరు అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మన్య లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కాగా ఒకరు ఏసీఎంలు ఉన్నారు.
మృతి చెందిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, కేంద్ర కమిటీ సభ్యురాలు అరుణ, ఏసీఎం సభ్యు రాలు అంజు ఉన్నట్లుగా తెలిసింది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో మూడు మృతదేహలతో పాటు మూడు ఏకే 47 తు పాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఒక పక్క మావోయిస్టుల బంద్ నడుస్తున్న నేపథ్యంలో మరో పక్క మన్యంలో ఎన్ కౌంటర్ జరగ డంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మరింత సమాచారం అందాల్సి ఉంది.