–నాటి సీఎం లు కేసీఆర్, జగన్ లపై వైఎస్ షర్మిల ఆగ్రహం
Ys Sharmila : ప్రజా దీవెన, విశాఖపట్నం: ఆంధ్రప్ర దేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ ష ర్మిల నాటి ముఖ్యమంత్రులు కేసీఆ ర్, వైఎస్ జగన్ లపై తనదైన శైలి లో విరుచుకపడ్డారు. నా రాజకీయ జీవితంపై వారిద్దరు ఫోన్ను ట్యాప్ ద్వారా కుట్రలు పన్నారని, ఇది అ త్యంత దుర్మార్గ మైన చర్య అని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డా రు. ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. విశాఖలో బుధ వారం మీడియాతో మాట్లాడారు.
ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అంటూ వైఎస్ జగన్ను ఉద్దేశించి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. గత ప్ర భుత్వాల హయాంలో తన ఫోన్ను నిరంతరం ట్యాప్ చేశారని ఆమె ఆ రోపించారు. కేవలం రాజకీయ ప్ర త్యర్థి అయినందుకే తన వ్యక్తిగత సంభాషణలను కూడా దొంగచాటు గా విన్నారని, ఇది వ్యక్తిగత గోప్య తకు తీవ్ర భంగం కలిగించడమే కా కుండా, ప్రజాస్వామ్య విలువలకు కూడా విఘాతమని ఆమె పేర్కొ న్నారు.తెలంగాణలో కేసీఆర్ ప్ర భుత్వం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగ న్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పు డు ఈ ఫోన్ ట్యాపింగ్ తతంగం న డిచిందని షర్మిల ఆరోపించారు.
ఒక మహిళ అని కూడా చూడకుం డా, ఒక రాజకీయ నాయకురాలిగా నా కార్యకలాపాలను అడ్డుకోవడాని కి, నా వ్యూహాలను తెలుసుకోవడా నికి ఇం త నీచమైన చర్యలకు పా ల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చే శారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేక రించిన సమాచారాన్ని తమ రాజకీ య ప్రయోజనాల కోసం వాడుకు న్నారని ఆమె దుయ్యబట్టారు.
ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యం లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు.
అధికారంలో ఉన్నవారు తమ అధి కారాన్ని దుర్వి నియోగం చేస్తూ, ప్ర త్యర్థులపై నిఘా పెట్టడం, వారి సం భాషణలను రహస్యంగా వినడం వంటివి చట్ట వ్యతిరేకమని, నైతికం గా కూడా తప్పని ఆమె స్పష్టం చేశా రు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై సమగ్రమైన విచారణ జరిపించా లని, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాం డ్ చేశారు. ఇలాంటి ఘటనలు పు నరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆ మె హితవు పలికారు. ప్రజల వ్య క్తిగత స్వేచ్ఛను, గోప్యతను కాపాడ టంలో ప్రభుత్వాలు విఫలమైతే ప్ర జాస్వామ్యం ప్రమాదంలో పడుతుం దని ఆమె హెచ్చరించారు.
గతంలో వైవీ సుబ్బారెడ్డి సైతం ట్యా పింగ్ విషయాన్ని ధ్రువీకరించి, ఓ ఆ డియోను తనకు వినిపించారని ష ర్మిల వెల్లడించారు. తెలంగాణలో త నను రాజకీయంగా, ఆర్థికంగా అణ గదొక్కేందుకే కేసీఆర్, జగన్ కలిసి ఈ కుట్ర పన్నారని ఆమె తీవ్రంగా ఆ రోపించారు.
ఫోన్ ట్యాపింగ్ ఘట నపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవం త్రెడ్డి, చంద్రబాబు నాయుడు తక్ష ణం విచారణను వేగవంతం చేయా లని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆ ర్ కోసం జగన్ తనను రాజకీయం గా అణచివేయాలని చూశారని ష ర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. విచా రణకు ఎప్పుడు పిలిచినా తాను హాజరవు తానని స్పష్టం చేశారు.