–4 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు వేశాం
–రైతుభరోసా కోసం మరో 1313 .53 కోట్లు విడుదల
–ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా న్నా ఏ పథకాలు ఆపలేదు
–రైతుల సంక్షేమం విషయంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ
— తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Minister Tummala Nageswara Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు 4 ఎకరాలకు వరకు రైతుభరోసా ని ధులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 1313.53 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. దీం తో మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించిన 6.33 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని, ఇ ప్పటి వరకు మొత్తం 5215.26 కో ట్లు రైతుభరోసా కోసం విడుదల చేసి, 58.04 మంది రైతులకు సహా యం అందించినట్టు తెలిపారు.
9 రోజుల్లో 9 వేల కోట్లను రైతుల ఖాతాలలో జమ చేస్తానని ము ఖ్య మంత్రి ఇచ్చిన హామీ మేరకు వరుస గా మూడో రోజు రైతు భరోసా నిధు లు విడుదల చేసినట్టు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా సా గు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని అందిస్తా మని చెప్పారు.
రైతుభరోసా విషయంలో బిఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్ర శ్నించే నైతిక హక్కు లేదని వ్యవసా యశాఖ మంత్రి అన్నారు. బిఆర్ ఎస్ నాయకులు రైతుభరోసా విష యంలో చేస్తున్న మోసపూరిత ప్రక టనలకు సమాధానం ఇచ్చారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా, వానాకాలం రైతుబంధు సహాయం ఎప్పుడు సా గు కాలానికి ముందుగా ఇవ్వలేక పోయిందని, ప్రతిసారి ఆలస్యం గానే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి జమ చేసారని అది కూడా 10వ నెల వరకు కొనసాగే దని గుర్తు చేసారు. అంతేకాకుండా ఏ ఒక్క సందర్భంలో కూడా 3 రోజు ల్లోనే 5 వేల కోట్లకు పైగా రైతుబం ధు కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని మంత్రి పేర్కొన్నారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నా, మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ రైతులకు ఇ చ్చిన మాట ప్రకారం దేశానికే ఆద ర్శంగా 2 లక్షల లోపు రైతు రుణ మాఫి పథకాన్ని పూర్తిచేసి చూపిం చామన్నారు.
అంతేకాకుండా రైతు భరోసా పథకం కింద ఎకరాకు 5 వేల నుండి 6 వేల కు పెట్టుబడి సహాయాన్ని పెంచి, రైతులకు అందచేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగికి సంబంధించిన రైతు బంధు నిధులను ఇవ్వకుండా గత ప్రభుత్వం వదిలేస్తే, మేము అధికా రంలోకి రాగానే వాటిని కూడా చె ల్లించామని అన్నారు. రైతుల సంక్షే మం కోసం అధికారంలోకి వచ్చిన ఏ డాదిన్నర కాలంలోనే దాదాపు 770 00 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖ ర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అలాంటి ప్రభుత్వాన్ని విమ ర్శించడం మానుకోవాలని హితవు పలికారు.
సీఎం ఇచ్చిన హామీ మేరకు వానా కాలం రైతుభరోసా నిధులు జమ చేస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్న కూడా 9 రోజులలో రై తుభరోసా సహాయాన్ని పూర్తి చేయ డానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉం దని, రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ఇ దొక ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నా యకులు ఆత్మ విమర్శ చేసుకొ ని మా ప్రభుత్వంపై విమర్శలు మా నుకోవాలని, లేదంటే తెలంగాణ రై తాంగం ఎప్పటికి క్షమించరని హెచ్చ రించారు. ఎలాంటి పరిస్థితులలో నై నా తెలంగాణ రైతాంగం కోసం మా ప్రభుత్వం నిలబడుతుందని, వారి సంక్షేమమే మా ప్రభుత్వం తొలి ప్రా ధాన్యమని తెలిపారు.