–బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీ నర్ పల్లగొర్ల మోదీరాందేవ్
Modi Ramdev: ప్రజా దీవెన నార్కట్ పల్లి: నార్కెట్ పల్లి శ్రీ చైతన్య స్కూల్ బుక్స్ సీజ్ చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి టౌన్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూలు యజ మాన్యం స్కూల్లో ఎలాంటి బుక్స్ గాని ఇతర సామాగ్రి అమ్మొద్దని గైడ్లై న్స్ ఉన్న అవి పెడచెవిన పెట్టి ఏ
యదేచ్ఛగా పుస్తకాలు బహిరంగం గా అమ్ముతూ సొమ్ము చేసుకుంటు న్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీ నర్ పల్లగొర్ల మోదీరాందేవ్ ఆరోపించారు.
విద్యార్థులతో తల్లిదండ్రులతో కలిసి బీసీ విద్యార్థి సంఘం నాయకులు పుస్తకాలు పట్టుకొని యంఈ ఓ కే.నరసింహకి విషయం తెలియ జేస్తే వాళ్ళ స్టాప్ అయినటువంటి కృష్ణను పంపించి స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ బుక్స్ రూమ్ సీల్ విధించ డం జరిగిందన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు బుక్ ఫీజ్ అని బడి ఫీజు అని బస్సు ఫీజు అని ట్యూషన్ ఫీజ్ అని డొనేషన్ ఫీజ్ అని ప్రైవేట్ విద్యాసంస్థలు దోచు కుంటున్నారు స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడ్లైన్స్ ఉన్న అవి పెడ చెవిన పెట్టి సొమ్ము చేసుకుంటు న్నారు.
2005 ఫీజు నియంత్రం చట్ట అమలులో ఉన్న అవన్నీ పట్టించు కోకుండా విద్యార్థుల రక్తం తాగు తున్నారు అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, భాస్కర్, విజయ్ కుమార్ రెడ్డి, విష్ణు గౌడ్, వినయ్, చంద్రం తదితరులు పాల్గొన్నారు.