Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Banakacharla Shutdown : బ‌న‌క‌చ‌ర్లను బరాబర్ బంద్ చేయండి

–రాష్ట్ర ప్రయోజ‌నాల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీప‌డ‌బోo
–తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు విరు ద్ధంగా ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న‌
–జీడ‌బ్ల్యూడీటీ, పున‌ర్విభ‌జ‌న చ‌ ట్టం ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతోన్న ఏపీ
–గోదావ‌రిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల జ‌లాల వినియోగానికి బ్లాంకెట్ ఎన్‌వోసీ ఇవ్వండి
–పాల‌మూరు, రంగారెడ్డి, స‌మ్మ‌ క్క‌,సారక్క‌,తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ల‌కు అన్ని అనుమ‌తులు ఇవ్వండి
–మూసీ పున‌రుజ్జీవ‌నానికి నిధులు కేటాయించండి
–ఇచ్చంప‌ల్లి, నాగార్జున సాగ‌ర్ అ నుసంధానంపై చర్చ‌కు సిద్ధo
–జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విన‌తి

Banakacharla Shutdown :  ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తు న్న గోదావరి-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించా ల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ కు ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యంలో గో దావ‌రి జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్ 1980 (జీడ‌బ్ల్యూడీటీ), ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం-2014ల‌కు వి రుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ్య‌ వ‌హ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి వారు తెలియ‌జేశారు. ఢిల్లీలోని శ్ర‌మ‌శ‌క్తి భ‌వ‌న్‌లో జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పా టిల్‌, ఆ శాఖ కార్య‌ద‌ర్శి దేబ‌శ్రీ ము ఖ‌ర్జీ, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మం త్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గురువారం స‌మావేశ‌మ‌య్యారు.

బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు అనుమ‌తుల వి ష‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ‌, ప‌ర్యా వ‌ర‌ణ శాఖ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో తెలంగాణ ప్ర‌జ‌లు, రైతుల్లో ఆందోళ‌ న‌లు నెల‌కొన్నాయ‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. గోదావ‌రి వ‌ర‌ద జ‌లాల ఆధారంగా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్ర‌తిపాదిస్తున్నామ‌ని ఏపీ చెబుతోంద‌ని, జీడ‌బ్ల్యూడీటీ- 198 0లో వ‌ర‌ద జ‌లాలు, మిగులు జ‌లా ల ప్ర‌స్తావ‌నే లేద‌న్నారు. 2014 ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం ఏ రా ష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మిం చాల‌నుకుంటే ముందు ఆ న‌దీ యా జ‌మాన్య బోర్డు, కేంద్ర జ‌ల‌ సంఘం (సీడ‌బ్ల్యూసీ), జ‌ల్‌శ‌క్తి మంత్రి అ ధ్య‌ క్ష‌త‌న‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సి ల్‌లో చ‌ర్చించి అనుమ‌తి పొందాల‌ ని బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఏపీ వీట‌ న్నింటిని ఉల్లంఘిస్తోంద‌ని కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఏ నిబంధ‌న‌లు పా టించ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌ద జ‌లాల ఆధారంగా ప్రాజెక్ట్ చేప‌డుతున్నా మ‌ని చెబుతుండ‌డం తీవ్ర అభ్యం త‌ర‌క‌ర‌మ‌ని జ‌ల్ శ‌క్తి మంత్రితో సీ ఎం పేర్కొన్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకొని బ‌ న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్ల‌కుండా చూడాల‌ని కేంద్ర మంత్రి సీఆర్ పా టిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉ త్త‌మ్ కుమార్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

సీడ‌బ్ల్యూసీ ప‌రిధిలోని సాంకేతిక స‌ల‌హా మండ‌లి నుంచి అనుమ‌తు లు పొంద‌కుండానే వ‌ర‌ద జ‌లాల పేరుతో పోల‌వ‌రం కింద పురుషోత్త‌ ప‌ట్నం, వెంక‌ట‌న‌గ‌రం, ప‌ట్టిసీమ‌, చింత‌లపూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ ను ఏపీ చేప‌ట్టింద‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమా ర్‌రెడ్డి తెలియ‌జేశారు. జీడ‌బ్ల్యూడీ టీ-1980 నిబంధ‌న‌ల ప్ర‌కారం పోల‌ వ‌రం డిజైన్లు మార్పు చేసింద‌ని, ప‌ ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌కు విరుద్ధం గా ప‌నులు చేప‌డుతోంద‌ని, తాము అభ్యంత‌రాలు లేవ‌నెత్తినా ప‌నులు మాత్రం కొన‌సాగిస్తూనే ఉంద‌ని కేం ద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం వి వ‌రించారు. జాతీయ‌ప్రాజెక్టు అయి న పోల‌వ‌రం విష‌యంలో ఎటువం టి నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదా వ‌రిలో వ‌ర‌ద‌ జ‌లాలున్నాయ‌ని ని జంగా ఏపీ భావిస్తుంటే పోల‌వ‌ రం-బ‌న‌క‌చ‌ర్ల‌కు బ‌దులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంప‌ల్లి-నాగార్జున సాగ‌ర్ అనుసంధానం ద్వారా పె న్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విష‌ యంలో చ‌ర్చ‌కు తాము సిద్ధ‌మ‌ని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి తెలిపారు. కృష్ణా జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్‌-2 తీర్పు త్వ‌ర‌గా వెలు వ‌డేలా చూడాల‌ని కేంద్ర మంత్రికి సీ ఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. తె లంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో తాము ఎట్టిప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌ డ‌బోమ‌ని, అన్ని వేదిక‌ల ద్వారా స‌ మ‌స్యలు సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని సీ ఎం కేంద్ర మంత్రి పాటిల్ కు తెలి య‌జేశారు. కేంద్ర స్పంద‌న అను కూలంగా లేక‌పోతే సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని కేంద్ర మంత్రికి సీ ఎం స్ప‌ష్టం చేశారు.

1500 టీఎంసీల‌కు వాడుకునే లా అనుమ‌తులివ్వండి .. తెలం గాణ‌కు గోదావ‌రి న‌దిలో 1000 టీ ఎంసీలు, కృష్ణా న‌దిలో 500 టీఎం సీలు మొత్తంగా 1500 టీఎంసీల నీ టి వినియోగానికి కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర‌ భ్యంత‌ర ప‌త్రం (ఎన్‌వోసీ) జారీ చే యాల‌ని, దానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆ మోదం తెల‌పాల‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రే వంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 1500 టీ ఎంసీల నీటితో కోటిన్న‌ర ఎక‌రాల‌కు నీరు అందుతుంద‌ని, ఆ త‌ర్వాత ఏ పీ చేప్ట‌టే ప్రాజెక్టుల అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలిస్తే త‌మ‌కు ఎటు వంటి అభ్యంత‌రం లేద‌న్నారు. ఆం ధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్రా జెక్టుల‌కు అనుమ‌తుల ప్ర‌క్రియ‌లో స‌త్వ‌రం స్పందిస్తూ తెలంగాణ ప్రా జెక్టుల విష‌యంలో మాత్రం అల‌స‌ త్వం ప్ర‌ద‌ర్శించ‌డం త‌గ‌ద‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రే వంత్ రెడ్డి అన్నారు. ఈ వైఖ‌రితో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప‌లు అపోహ‌ లు, ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లె త్తుతున్నాయ‌న్నారు. పాల‌మూరు రంగారెడ్డి, స‌మ్మ‌క్క‌-సారక్క‌, తు మ్మిడిహెట్టి ప్రాజెక్టుల‌కు నీటి కేటా యింపుల‌తో పాటు అన్ని ర‌కాల అ నుమ‌తులు వెంట‌నే మంజూరు చే యాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

గంగా, య‌మునా న‌దుల ప్ర‌క్షాళ‌న‌ కు నిధులిచ్చిన‌ట్లే మూసీ పున‌రుజ్జీ వ‌నానికి నిధులు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో స‌మావేశం అనంత‌రం రా ష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వి లేక‌రుల‌తో మాట్లాడారు. సుదీ ర్ఘం గా సాగిన స‌మావేశంలో త‌మ విజ్ఞ‌ ప్తుల‌కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార‌ని వెల్ల‌డించారు. బ‌న‌క‌ చ‌ర్ల‌కు సంబంధించిన డీపీఆర్ త‌మ‌ కు అంద‌లేద‌ని కేంద్ర మంత్రి తెలిపా ర‌ని, త్వ‌ర‌లోనే ఎపెక్స్ కౌన్సిల్ స‌ మావేశం నిర్వ‌హిస్తామ‌ని హామీ ఇ చ్చార‌ని రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ తెలి పారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భు త్వ నీటి పారుద‌ల శాఖ స‌ల‌హా దారు ఆదిత్య‌నాధ్ దాస్‌, ముఖ్య‌ మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల స‌మ‌ న్వ‌య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉ ప్ప‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.