— ఎంపీ ఈటెల రాజేందర్ సవాల్
Political Renunciation : ప్రజా దీవెన,హైదరాబాద్ : కాళేశ్వ రం వంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం కేబి నెట్ ఆమోదం లేకుండా నిర్మించా రని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యా ఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ మ ల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూ పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుం టానని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కేబినెట్ లో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఒక వేళ నిర్ణయం తీసుకున్న కేబినెట్ ఆమో దం తీసుకుంటారని తాను బీజేపీ ఎంపీగా కాకుండా నాటి మంత్రిగా చెబుతున్నానని ఎంపీ ఈటల స్ప ష్టం చేశారు.
అప్పటి మంత్రులు మీ పక్కనే ఉన్నారు.. అడిగి తెలుసుకోండి
కేబినెట్ ఆమోదం లేకుండా కాళే శ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉం దా అని ఈటల ప్రశ్నించారు. కేసీఆ ర్ కేబినెట్ లో మంత్రులుగా పనిచే సి ఇప్పుడు మీ పక్కనే ముగ్గురు ఉ న్నారని, వారిని అడిగి తెలుసుకోం డి అని సలహా ఇచ్చారు. ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడు నిర్ణ యాలు తీసుకోలేదని స్పష్టం చేశా రని అన్నారు.