బిగ్ బ్రేకింగ్, ఘోర రోడ్డు ప్రమాదం లో తొమ్మిదిమంది దుర్మరణం
BengalRoadaccident ప్రజా దీవెన, పశ్చిమ బెంగాల్ : దేశం లో రోడ్డు ప్రమాదాల సంఘట న లు రోజు రోజుకూ పెరిగిపోతున్నా యి. తాజాగా పశ్చిమబెంగాల్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసు కుంది. బొలేరో వాహనం ట్ర క్కును ఢీ కొట్టిన ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత ప డ్డారు. పురులియా జిల్లాలో శుక్రవారం ఉద యం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
బలరాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నామ్షో ల్ సమీపంలోని జాతీయ రహదారి 18పై ఈ ఘటన చోటు చేసుకుంది. పురులి యాలోని బారాబజార్ పోలీ స్ స్టేషన్ ప్రాంతంలోగల అడబానా గ్రామానికి చెందిన పలువురు జార్ఖం డ్లోని నిమ్దిహ్ ప్రాంతంలో తిలై తాండ్లో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి బొలెరో వా హనంలో వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా వీరు ప్రయాణి స్తు న్న బొలేరో వాహనం అదుపుతప్పి ట్రక్కును బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో బొలేరో వాహనంలోని తొమ్మిది మందికి తీవ్ర గాయాల య్యాయి. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తర లించగా వారంతా మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.