— రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి
Minister Gaddam Vivek Venkata Swamy: ప్రజా దీవెన, సిద్దిపేట: పేదల సం క్షే మానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చే స్తోందని మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి తెలిపారు. ప్రతి ఇందిరమ్మ ఇంటికి తమ ప్రభుత్వం రూ.5లక్ష లు ఇస్తోందని అన్నారు. సిద్దిపేట జి ల్లాకు 12వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్ర తి గ్రామంలోని పేదవారికి ఇం దిర మ్మ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. పేదరికాన్ని దూరం చే యాలని ఇందిరాగాంధీ గరీబ్ హ టావో పేరుతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ పేదలకు మంచి చేయాలనే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నార ని పేర్కొన్నారు మంత్రి వివేక్ వెంకట స్వామి. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్ లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప త్రాలను మంత్రి వివేక్ వెంకటస్వా మి పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మంత్రి వివేక్ మీడియాతో మా ట్లాడారు.
సిద్దిపేటలో అడ్వాన్స్ టె క్నాలజీతో స్కిల్ డెవలప్మెంట్ని ప్రారంభిస్తా మని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీలు నెరవే రుస్తారా అని ప్రజల్లో అనుమానం ఉండేదని చెప్పారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక రూ. 8ల క్షల కోట్లు అప్పుఅయిందని అన్నా రు. కాంగ్రె స్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హా మీలు నెరవేర్చాలని కంకణం కట్టు కుందని తెలిపారు. తమ ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని ఆలోచన చేస్తోందని మంత్రి వివేక్ వెంకట స్వామి వెల్లడించారు. మహిళలకు రూ.500లకు గ్యాస్ సిలిండర్, ఉచి త బస్ సౌకర్యం అందిస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు దేశంలో ఎక్కడ లేని వి ధంగా రైతులకు రూ. 23వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు.
సుమారు రూ.10వేల కోట్ల రైతు భ రోసా నిధులను సీఎం రేవంత్రెడ్డి ఇటీవల విడుదల చేశారని తెలిపా రు. రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని తమ ప్రభు త్వం ప్రవేశ పెట్టిందని చెప్పారు. స న్నవడ్లు పండించే రైతులకు ప్రభు త్వం రూ.500ల బోనస్ ఇస్తోందని వెల్లడించారు మంత్రి వివేక్ వెంకట స్వామి.
అంతకుముందు గజ్వేల్లో ఇం దిర మ్మ ఇండ్ల లబ్ధిదారులకు మం జూ రు పత్రాలను మంత్రి వివేక్ వెంక ట స్వామి పంపిణీ చేశారు. గజ్వేల్లో 3వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల ని ర్మాణం కోసం నిధులు మంజూర య్యాయని తెలిపారు. ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. గృహజ్యోతి కింద 79 వేల మంది లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ అం దిస్తున్నామని చెప్పారు. పేదలకు రేషన్కార్డ్ ద్వారా సన్నబియ్యం పం పిణీ చేస్తున్నామని వెల్లడించారు. 6 00 గజాల స్థలంలో ప్రతి నిరుపేద ఇండ్లు కట్టుకునేందుకు తమ ప్రభు త్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. విద్య, వైద్యం, ఇండ్లు, రైతుల సం క్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 600 గజాల కం టే ఎక్కువ ఇంటి నిర్మాణం ఉండేలా లబ్ధిదారులు చూసుకోవాలని అ న్నారు. ఇందిరమ్మ పథకాన్ని పక డ్బందీగా అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొ న్నారు.ఈ కార్య క్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ హేమావ తి పాల్గొన్నారు.