–బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్ తో ప్రాజెక్టులు కడితే బాగుండేది
–కేసీఆర్కు అపరజ్ఞానం వల్లే కాళే శ్వరం కూలేశ్వరమైంది
— భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
MP Chamala Kiran Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో నీళ్ళు అనే పదంతో బీఆర్ ఎస్ రాజకీయం చేసిందని, బీఆర్ ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్తో ప్రా జెక్టులు కడితే బాగుండేదని భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.బీఆర్ ఎస్ నేత హరీష్ రావు వాళ్ల మామ మాజీ సీ ఎం కేసీఆర్ ను విలన్ చేసే ప్రయ త్నం చేస్తున్నారని ఎంపీ చామల ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మా ట్లాడారు. కాళేశ్వరం కూలిన తర్వా త తెలంగాణ ప్రజలకు నీళ్ల సంగతి పూర్తిగా అర్థమైందని, 2016 సీ డ్ల్యూసీ మీటింగ్లో కేసీఆర్ ఏం మా ట్లాడారో చెప్పాలన్నారు.
కేసీఆర్కు ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని విమర్శించారు.తెలంగాణ నీళ్లకు అన్యాయం చేసింది కేసీఆర్ జగన్ రెడ్డితో నాలుగు సార్లు మంతనాలు జరిపి తెలంగాణ నీళ్లకు అన్యాయం చేసింది కేసీఆర్ అని, హరీష్ రావు వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలో చన చేశారని అన్నారు.
గోదావరి జలాలపై గొంతు చించు కునే బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలా లపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నిం చారు. హరీష్ రావుకు కంటెంట్ కం టే ఎక్కువ ఆవేశమే ఉందని, బీఆర్ ఎస్ నేతలు సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డిని చూడలేకపోతున్నారని అ న్నారు. నదీ జలాలు ఎవరి అయ్యా జాగీరు కాదని హరీష్ రావు తెలు సుకోవాలన్నారు.అందుకే ప్రజలు బీఆర్ఎస్ను పక్కకు పెట్టారు.
నీళ్ళ అంశంపై తనకు, కేసీఆర్కు తప్పా ఎవరికీ ఏం తెలియదని హ రీష్ అనుకుంటున్నారని, తెలంగా ణ నీటిని ఏపీకి ధారాదత్తం చేసిందే కేసీఆర్ అని చామల కిరణ్ ఆరోపిం చారు. హరీష్ రావు ఇరిగేషన్ మం త్రిగా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైందన్నారు. బనకచర్ల వి ష యంలో కేంద్రం వినకపోతే సుప్రీం కోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటిం చిన సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెం ట్ అర్థం చేసుకోవచ్చునని అన్నా రు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్ నుండి బీఆర్ఎ స్ ఎంపీ వాకౌట్ చేసారన్నారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మ ల్ని పక్కన పెట్టారన్నారు. బేసిక్స్ కా దు తమకు ఎథిక్స్ ఉన్నాయి కాబ ట్టే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని ఎంపీ చామల కిరణ్ అన్నారు.