Bandi Sanjay: ప్రజా దీవెన హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట ల భించింది. తనపై నమోదైన నాలు గు కేసులు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ పై న్యాయస్థానం శుక్రవా రం విచారించింది. కోర్టుకు హాజరు నుంచి బండి సంజయ్ కు మిన హాయింపు ఇచ్చింది. తదుపరి వి చారణను జులై 14వ తేదీకి వా యి దా వేసింది. కాగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ లో ఆయ నపై నమోదైన కేసును న్యాయ స్థా నం కొట్టివేసిన విషయం తెలిసిందే.
నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లే కుండా భారీ వాహనాలతో కాన్వా య్ నిర్వహించారని ఎన్నికల అధి కారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజాప్రతి నిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా ఇటీవల హైకోర్టు కొట్టి వేసింది. ఈ క్రమంలోనే మిగిలిన కే సులను కూడా కొట్టివేయాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.