–చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
–ఐఓబి మేనేజర్ రాఘవేంద్ర గుప్తా
IOB Manager Raghavendra Gupta: ప్రజా దీవెన, దేవరకద్ర:చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఇం డియన్ ఓవర్సీస్ బ్యాంక్ ( ఐ ఓ బి) లక్ష్మీ పల్లి బ్రాంచ్ మేనేజర్ రాఘవేం ద్ర గుప్తా అన్నారు. దేవరకద్ర మం డలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల లో నూతనంగా ఒకటవ తరగతి లోని చేరిన విద్యార్థులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం కార్య క్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి దేవి కి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ యం ఎస్.కల్పన అధ్యక్షతన జరిగిన వేడుకలో ఐ ఓ బి మేనేజర్ రాఘవేంద్ర గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మెలుగుతూ చదువులో రాణించాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరుగుతున్నప్పటికీ దేశ సంస్కృతి,సంప్రదాయాలను విద్యార్థులకు అందించడం అభినందనీయం అన్నారు.
మాజీ సర్పంచ్ రాందేవ్ రెడ్డి మాట్లాడుతూ జ్ఞానం,వాక్కు, విద్యా మొదలైన శక్తులే సరస్వతి మాత అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కంకణ బద్దలై పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోని చదువులో రాణించాలని కోరారు.
పలకలు ప్రదానం చేసిన మాజీ సర్పంచ్ విశ్వేశ్వర చారి
లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల లో నూతనంగా ఒకటవ తరగతి లో చేరిన విద్యార్థులకు గ్రామ మాజీ సర్పంచ్ వడ్ల విశ్వేశ్వర చారి తన సొంత ఖర్చులతో విద్యార్థులకు పలకలు, బల పాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్యకు ప్రాధాన్యత ఉందని అన్నారు. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను చదివించాలని కోరారు. జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధియే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. బడి ఈడు వయస్సు కలిగిన పిల్లలను బడి లో చేర్పించాలని కోరారు. పాఠశాల హెచ్ యం కల్పన మార్గదర్శనంలో విద్యార్థులు ఆలపించిన శ్లోకాలు అందరిని ఆకట్టుకున్నాయి. కాగా ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నాగేష్ గౌడ్,పాఠశాల హెచ్ యం ఎస్.కల్పన, ఉన్నత పాఠశాల ఇంచార్జ్ హెచ్ యం మురళీధర్, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, విజయ లక్ష్మీ, నాగేశ్వర్ రెడ్డి, ఆశ్ర ఖాద్రి, శంకర్, కమల్ రాజ్, మదన్ మోహన్, సుజాత , వెంకట్రాములు, అంగన్వాడీ టీచర్లు, లక్ష్మీ, పాండమ్మ తదితరులు పాల్గొన్నారు.