Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: బనకచర్లపై చంద్రబాబుతో చర్చ లకు సిద్ధం

— ఢిల్లీ మీడియా చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: గోదావరి బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు సి ద్ధంగా ఉన్నామని తెలంగాణ ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తా ము ఎవరితో వివాదాలు కోరుకోవ డం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 23వ తేదీ తెలంగాణ కేబినెట్ స మావేశం జరుగుతుందని, ఈ భేటీ లో చర్చించిన తర్వాత చంద్రబాబు ను చర్చలకు ఆహ్వానిస్తామని అ న్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొ దట సంప్రదించకుండా కేంద్ర ప్రభు త్వాన్నిఏపీ బనకచర్లపై సంప్రదిం చిందని అదే తమ అభ్యంతరమని తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకునేందు కు అధికారులు, మంత్రుల స్థాయి లో కమిటీలు ఏర్పాటు చేశామని వివరించారు. ఢిల్లీలో శుక్రవారం ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడి యాతో చిట్‌చాట్ నిర్వహించారు.

ఎవరితోనూ తాము వివాదం కోరు కోవడం లేదని ఎవరికోసం తమ హ క్కులు వదులుకోమని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కృ ష్ణాజిల్లాలో 500 టీఎంసీలకు బ్లాం కెట్ ఎన్ఓసీ‌కి తాను అడిగినందుకు మాజీ మంత్రి హరీష్‌రావు తప్పుప డుతున్నారు,హరీష్ వాదనలో పస లేదని చెప్పారు. 2023లో కేంద్రాని కి హరీష్‌రావు రాసిన లేఖలో కేవ లం 405 టీఎంసీలు మాత్రమే అడి గారని గుర్తుచేశారు. తెలంగాణలో తమ ప్రాజెక్టు పూర్తయి, పూర్తిస్థా యిలో నీటిని వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ వారి ప్రాజె క్టులకు గురించి ఆలోచించాలని కో రారు. నీళ్లు నిధులు మోసపూరిత సెంటిమెంట్ గతంలో అడ్డుపెట్టుకు న్నారని ఇప్పుడు జలాలను సం జీవని అని బీఆర్ఎస్ నేతలు భా విస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అ న్నారు.

కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం బీఆ ర్ఎస్ తప్పు చేసిందని మండిప డ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కు లు రాసిచ్చారని ఆరోపించారు. రా యలసీమను రత్నాలసీమ చేస్తా నని కేసీఆర్ అన్నారని, మరీ ఇప్పు డు గోదావరి జలాలను ఏపీ ఉప యోగించుకుంటే తప్పేంటని ప్రశ్నిం చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు అం దించారని చెప్పారు. ఈ ఏడాదిలో తెలంగాణలో పండిన అత్యధిక పం టలకు కాళేశ్వరం నీళ్లకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. కృష్ణ గోదా వరి జలాలపై తెలంగాణ హక్కు ల ను ఏపీకి రాసిచింది కేసీఆర్, హరీ ష్‌రావులే అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.