Tipparti SI: ప్రజా దీవెన, తిప్పర్తి: తిప్పర్తి మండల నూతన ఎస్ హెచ్ ఓ(ఎస్సై) గా శుక్రవారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో వి. శంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్సైగా పనిచేసిన సాయి ప్రశాంత్ హాలియా కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎస్సైగా శంకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై శంకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ ను అరికట్టడంతో పాటు గవర్నమెంట్ పథకం ద్వారా అందించే పిడిఎస్ రైస్ పక్కదారి పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిప్పర్తి మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు ప్రజలు సహకరించి మండలాన్ని శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు సహకరించాలని సూచించారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అక్రమ చర్యలకు పాల్పడే వారుంటే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. మండల ప్రజలు నేరుగా తనను కలిసి వారి సమస్యలను తెలియజేయవచ్చని అన్నారు.