Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

International Yoga Day: నిత్యం వత్తిడులతో గడిపే ఉద్యోగులకు యోగ తప్పనిసరి

–యోగ వల్ల ఆరోగ్యంతో పాటు, పనిపై శ్రద్ధ కలుగుతుంది

–జిల్లా యంత్రాంగం తరఫున అధికారులు, సిబ్బందికి యోగా తరగతుల ఏర్పాటు

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

International Yoga Day:   ప్రజా దీవెన, నల్లగొండ: యో గాను జీవన విధానంగా మార్చు కోవాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి పిలుపునిచ్చారు. 11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పుర స్కరించుకొని శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో ఉన్న ఎం.వి.ఆర్ కాన్సెప్ట్ పాఠశాల లో ఆయుష్ శాఖ, జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ, పతంజలి యోగ సమితి సంయుక్త ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక స్థిరత్వాన్ని సాధించవచ్చని, దీనికి తోడుగా సాత్విక ఆహారం, మం చి అలవాట్లతో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. యోగ వల్ల ఆరోగ్యంతో పాటు, పనిపై శ్రద్ధ కలుగుతుందని, జిల్లా యంత్రాంగం తరఫున అధికారులు, సిబ్బందికి యోగా తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరు అల్పాహారం, జ్ఞానం , శారీరక శ్రమతో పాటు, మానసిక ప్రశాంతత అలవాటు చేసుకోవాల ని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పని చేసినట్లయితే అను కున్న లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని అన్నారు.

 

రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. ప్రతినిత్యం వత్తిడుల తో గడిపే ఉద్యోగులకు యోగ తప్పనిసరి అని, దీని ద్వారా మాన సిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులు యోగ విన్యాసాలను ప్రదర్శించగా, కొంతమంది చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిం చారు. అనంతరం జిల్లా కలెక్టర్ యోగా గురువులకు సన్మానం చేసి ప్రశంస పత్రాలను అందజేశారు. ఆర్డీవో అశోక్ రెడ్డి, ఇంచార్జ్ సిఈఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.