Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Best Available Scream: ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశానికి గిరిజన విద్యార్థుల ఎంపిక

–సీట్ల తగ్గింపు పై అధికారులను నిలదీసిన తల్లిదండ్రులు

Best Available Scream: ప్రజాదీవెన నల్గొండ: బెస్ట్ అవైలబుల్ స్క్రీమ్ ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల ప్రవేశానికి ఎంపిక కోసం శుక్రవారం స్థానిక గిరిజన వసతి గృహ ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి చత్రు నాయక్ ల సమక్షంలో డ్రా తీశారు. మొత్తం 34 సీట్లలో బాలురకు బాలికలకు రిజర్వేషన్ ప్రకారం లాటరీ తీసి అడ్మిషన్ ఇచ్చారు. అయితే గత సంవత్సరం 100 సీట్లు ఉండగా ప్రస్తుతం కేవలం 34 సీట్లు మాత్రమే కేటాయించడంతో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ ను గిరిజన అధికారులను ఎందుకు సీట్లను తగ్గించారని ప్రశ్నించారు.


కేవలం 34 సీట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని 184 దరఖాస్తులు వస్తే 34 సీట్లు ఇవ్వడం వలన సీట్ రానివారు ఎటు వెళ్ళాలని ప్రశ్నించారు. కాగా అదనపు కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం, డివి. నాయక్, ఏవో పార్థసారథి, వార్డెన్ రామకృష్ణ, సూపరిండెంట్ అతిఖ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.