Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Phone Tapping case: ట్యాపింగ్ కేసు లో ట్విస్ట్ లే ట్విస్ట్ లు

–సిట్ విచారణలో ఎప్పటికప్పుడు ఊహించని మలుపులు
–మాజీ డీజీపీ మహేందర్రెడ్డి పేరు ప్రస్తావించిన ప్రభాకర్ రావు
— ఆయన ఆదేశాలతోనే విదేశాలకు వెళ్లానని వాగ్మూలం

Phone Tapping case: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పటికప్పుడు ట్విస్ట్ మీద ట్విస్ట్ లతో ఆసక్తికరం గా మారుతుంది. ఇన్నాళ్లు పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చి న ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మా జీ చీఫ్ ప్రభాకర్ రావు అనూహ్యం గా మరొకరి పేరు తెరమీదకు తీసు కురావడంతో రాజకీయ వర్గాలను ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తోంది. విచారణలో భాగంగా తన చేత నాటి ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాప్ చేయించారని ఆయన కేసీఆ ర్ ప్రభుత్వంలో మహేందర్ రెడ్డి కీల క బాధ్యతలు నిర్వర్తించారు. ఆయ నను కేసీఆర్ డీజీపీగా నియమిం చారు. ఆయన ఆ హోదాలో అప్ప ట్లో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉ న్నారు. ఆయనతో పాటు శాంతికు మారి, రవిగుప్తా, అనిల్ కుమార్ రి వ్యూ కమిటీలో ఉండగా తాజాగా ప్రభాకర్ రావు మహేందర్ రెడ్డి పేరు ను ప్రస్తావించారు. అంతటితో ఆగ కుండా తాను పదవీ విరమణ చేసి న తర్వాత అప్పటి డీజీపీ మహేం దర్ రెడ్డి తన ఎక్స్టెన్షన్ కోసం ప్రభు త్వానికి ప్రతిపాదన పంపించారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన సొంత నిర్ణయం ఏమీ లేదని, కేసీ ఆర్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

మహేందర్ రెడ్డి కి కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సీ ఎం రేవంత్ ప్రభుత్వం టీజీపీఎస్సీకి చైర్మన్ గా నియమించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మహేందర్ రెడ్డి కిమంచి సంబంధాలు ఏర్పడ్డా యనే చర్చ లేకపోలేదు. అటువం టిది సిట్ ముందు ప్రభాకర్ రావు ఆయన పేరు ప్రస్తావిస్తూ కేసీఆర్ తో సంబంధం లేదని చెప్పడం వెను క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టే ఎత్తుగడ వేశారా అనే చ ర్చ సాగుతోంది.

అనూహ్యంగా నాటి డీజీపీ మహేం దర్రెడ్డి చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశా నని నిన్నటి విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు సిట్ కు వివరణ ఇ చ్చినట్లు తెలుస్తోంది. మాజీ డీజీపీ పేరును ప్రస్తా వించడం వెనుక మ తలబు ఏంటి ఈ కేసులో ఏం జరగ బోతున్నది అనేది ఆసక్తిగా మారిం ది.

మహేందర్రెడ్డితోపాటు అప్పటి రి వ్యూ కమిటీ సభ్యుల నుంచి దర్యా ప్తు అధికారులు వాంగ్మూలాలు సేక రించినట్లు తెలుస్తోంది. దీంతో మ హేందర్రెడ్డి సిట్ కు ఏం చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ ఆదేశాల వెనుక ఉన్నదెవరో వివరించారా అనేది ఆ సక్తిగా మారింది. నిజానికి ఏ ము ఖ్యమంత్రి కైనా చెవులు, కళ్లు అం తా స్టేట్ ఇంటలిజెన్స్ విభాగమే. కే సీఆర్ హయాంలో ప్రభాకర్ రావు నే తృత్వంలోని ఇంటలిజెన్స్ విభాగా న్ని విచ్చలవిడిగా ఉపయోగించార నే విషయాన్ని సిట్ గుర్తించింది. ఈ కేసులో ప్రభాకర్ రావు తెలివిగా రా జకీయ ప్రముఖుల పేర్లకు బదులు గా ఉన్నతాధికారుల పేర్లు చెప్పినా తిరిగి అది గత ప్రభుత్వ పెద్దల మె డకే చుట్టుకోక తప్పదా అనే విస్తృ త చర్చ జరుగుతోంది.