International Yoga day: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయంలో జాతీయ యోగా దినోత్సవం వేడుకలు భక్ ఘనంగా నిర్వహిఓచారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బి జెపి ప్రధాన కార్యదర్శి కాసం వెంక టేశ్వర్లు హాజరయ్యారు. జిల్లా అ ధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని, యోగా అభ్యాసంలో భాగస్వాము లయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ యోగం మన ప్రా చీన భారతీయ ఋషుల పరిణత దృష్టి ఫలితంగా పుట్టిన జీవనశా స్త్రం. ఇది మనిషిని సంపూర్ణంగా అ భివృద్ధి చేసే పద్ధతి. శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు శాంతి, ఆత్మ కు శుద్ధి కలిగించే సూత్రపధ్ధతి ఇది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టు దలతో యోగం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించడం ద్వారా భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేశా రు.
ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యో గాను అలవర్చుకోవాలి. ఇది ఆ రోగ్య సమాజ నిర్మాణానికి పునాది వే స్తుంది. మన యువత ఈ సంప్ర దాయాన్ని కొనసాగించాలని, భవి ష్యత్ తరాలకు దీపస్తంభంగా నిల వాలని ఆశిస్తున్నానన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది – ఆ మార్గంలో యోగా ఒక అద్భుత ఆయుధం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూ దన్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్ ,
పిల్లి రామరాజు యాదవ్ తదితరులు ఉన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
