Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SFI All India 18th Congress: మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు కార్యచరణ

–ఈనెల 27 నుండి 30 వరకు కేరళ లో ఎస్ఎఫ్ఐ అఖిలభారత 18వ మహాసభలు

–ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్

–అఖిల భారత మహసభలకు ప్రతినిధిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

SFI All India 18th Congress: ప్రజాదీవెన నల్గొండ : ఈనెల 27 నుండి 30 వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చి కోడ్ లో జరగనున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత 18వ మహాసభలకు ప్రతినిధిగా నల్లగొండ జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ ఎంపికయ్యారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
పోరాటాల ఖీల్లా నల్లగొండ జిల్లా నుంచి ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభలకు ఐదుగురు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో విద్యారంగంలో మొదటి స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత 18 మహాసభలకు ఒక ప్రత్యేక నేపథ్యం వుందని పేర్కొన్నారు.దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలను రూపొందించడం కోసం భవిష్యత్తు కార్యచరణ రచించడం కోసం ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయని తెలిపారు.

దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చరిత్ర విద్యా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపైన ఈ మహాసభల్లో అనేక తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలకు రెడ్ కార్పొరేషన్ వేసి స్వాగతం పలుకుతుందని విమర్శించారు. విద్యారంగంలోకి మత విశ్వాసాలను చోపిస్తూ విద్యారంగాని మతోన్మాదకరం, కాషాయికరణం చేయడం కోసం కంకర కట్టుకున్నారని ఆలోచించారు.

నరేంద్ర మోడీ హయాంలో ప్రభుత్వ విద్యారంగా సంస్థలు ప్రభుత్వ సెక్టార్ గా పూర్తిగా ప్రైవేట్ పరం చేసి విద్యను అంగట్లో సరుకుగా మార్చి పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువులపై నీళ్లు జల్లుతున్నారని అన్నారు. భవిష్యత్తులో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులను కదిలించి బలమైన విద్యార్థి సమరశీల పోరాటాలు నిర్వహించడం కోసం కేరళ రాష్ట్రంలో జరుగుతున్న 18 మహాసభలు వేదిక కాబోతున్నాయని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై‌ భవిష్యత్తులో బలమైన విద్యార్థి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందుకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు నంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్న చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ఎస్ఎఫ్ఐ 18వ అఖిల భారత మహాసభలకు నల్గొండ జిల్లా నుంచి ఆకారపు నరేష్, కుంచం కావ్య, స్పందన, కుర్ర సైదా నాయక్ హాజరవుతున్నారని అన్నారు. అఖిల భారత మహాసభలకు వెళ్తున్న విద్యార్థి ప్రతినిధులకు విద్యావంతులు, మేధావులు హార్దికంగా ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.