–పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్
PCC President Mahesh Kumar: ప్రజా దీవెన, నిజామాబాద్: రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, మంత్రివ ర్గంలో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షు డు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చే శారు. ఆదివారం నిజామాబాద్ ప ర్యటన సందర్భంగా జిల్లాకేంద్రంలో ని ఆయన మీడియాతో మాట్లాడా రు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరు తో వేల కోట్లు నీటిలో పోశారని వి మర్శించారు. పూర్తిగా నాసిరకం ప నులతో కాళేశ్వరం కాస్తా కూలేశ్వ రం ప్రాజెక్టు గా మారిందన్నారు.
బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గే దిలేదని పునరుద్ఘాటించారు. ఫోన్ ట్యాప్ అయిన 650మంది పేర్లను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని, సిట్ ను కోరుతున్నానని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫో న్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని ఆరోపించారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద నేరమని ఆందోళన వ్యక్తం చేశారు.