–సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
Thummalla veera reddy: ప్రజాదీవెన నల్గొండ: విద్వేషాన్ని నింపిన మత రంగు పులి మిన రజాకర్ సినిమాకు గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడం ఆయన నమ్మిన సిద్ధాంతానికి వ్యతిరేకమని, అవమానకరమనీ సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజలను పీడించి వెట్టిచాకిరినీ చేయించిన జమీందారులు, భూస్వాములు, జాగిరిదారులు ప్రజలపై పన్నులు వేసి పీడనకు గురిచేసిన నైజాం నవాబు పాలనను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించిన రజాకారు సినిమాకు అవార్డు జూరీ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్వామీకులకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విలువలు లేని సినిమాలకు అవార్డులు ఇచ్చి అవమానపరిచారాని మండిపడ్డారు. కమ్యూనిస్టులు చేసిన పోరాటంను రజాకారు సినిమాలొ మత రంగు పులిమి విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్న సినిమాలకు ప్రమోట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రజావాధ్యయకారుడు గద్దరు ఉన్నత విలువల కోసం కులము, మతము లేని సమాజం కోసం గద్దర్ పరి తపించాడని కొనియాడారు. విలువలను తుంగలో తొక్కి అవమానకరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. సమాజంలో ప్రజలు త్యాగాలు చేసి నైజాం నవాబును గద్దె దించిన చరిత్రను వక్రీకరించిన రజాకార సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడటం సిగ్గుచేటని విమర్శించారు. లౌకిక విలువలకు పాతరవేసి జ్యూరీ కమిటీ సినిమాను ఎంపిక చేసి చరిత్రకు వ్యతిరేకంగా మాట్లాడిందని పేర్కొన్నారు.