Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagam varshith reddy: నేటితరానికి స్పూర్తిదాయకం శ్యామ ప్రసాద్ ముఖర్జీ

–బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి

Nagam varshith reddy: ప్రజా దీవెన, నల్గొండ టౌన్:డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదా న్ దివస్ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్ర ప టానికి బీజేపి నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు ఆరోపించారు.ఈ సందర్భంగా బీజే పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ ఛాలెంగే ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు , ఇద్దరు ప్రధానులు మరియు రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు
అని పోరాడి అసువులు బాసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిదని కొనియాడారు. దేశం పట్ల యువతకు, భక్తి,భావకా లం ,ప్రేమ కలిగియుండాలని పిలు పునిచ్చారు.అదే విధంగా శ్యామ ప్ర సాద్ ముఖర్జీ నీ ఆదర్శంగా తీసు కోవాలని అన్నారు.

అనాడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను జ మ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి ఆర్టికల్ 370ని రద్దు చేసి అమలు లోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎట్టకేలకు దా ని వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కల సాకారం అయింద న్నారు. అదే విధంగా పట్టణంలోని 34వ వార్డులో డాక్టర్ శ్యామ్ ప్రసా ద్ ముఖర్జీ బలిదాన్ దివస్‌ను పుర స్కరించుకుని పర్యావరణ పరిరక్ష ణలో భాగంగా మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని నిర్వహించడం జరిగిం ది .

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా నాగం వర్షిత్ రెడ్డి హాజరై మొ క్కలను నాటి పర్యావరణ కాపాడా లని కోరారు, మొక్కలు నాటడం అంటే మన భవిష్యత్‌కు నీడ వేసే గొప్ప కార్యక్రమం అని ఈ సంద ర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో బిజెపి జాతీయ కిసాన్ మో ర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు , బిజెపి రాష్ట్ర నాయ కులు వీరెల్లి చంద్రశేఖర్,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగ స్వామి, బీజేపీ నాయకులు కంచర్ల విద్యసాగర్ రెడ్డి,పక్కిరు మోహన్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెల కాశమ్మ , బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి మంగళపల్లి కిషన్, బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ బిపంగి జగ్జీవన్, దర్శనం వేణు పట్టణ నాయకులు వివిధ మోర్చా నాయకులు తదిత రులు పాల్గొన్నారు.