— ఇప్పటివరకు 26 సార్లు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వలేదు
–జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలపై స్పందించనందుకే నేను డైరెక్ట్ గా వచ్చా
–నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
— కావాలనే కొప్పుల ప్రదీప్ రెడ్డిపై రాజకీయ కుట్ర అని ఆరోపణ
Former MLA of Nakirekal Chirumarthi Lingaiah: ప్రజాదీవెన నల్గొండ: నల్గొండ జిల్లా కలెక్టర్ ఎవ్వరి ఫోన్లు లిఫ్ట్ చెయ్యరు. ఇప్పటివరకు 26 సార్లు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వలేదు. కలెక్టర్ ఎవ్వరి ఫోన్లు లిఫ్ట్ చెయ్యరు. ఎవ్వరికి సమాధానం ఇవ్వరని జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలపై స్పందించనందుకే నేను డైరెక్ట్ గా కలెక్టరేట్ వచ్చా అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఆయన నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయ వాణి శ్రీను అర్జీలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కొప్పుల ప్రదీప్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే అధికారులు తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నారని అన్నారు.
తప్పుడు రికార్డ్ తో కేతేపల్లి పంచాయతీ సెక్రటరీ పై వేటు వేసారు. అధికార పార్టీ నాయకుల అండతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో అధికారులు పని చేస్తున్నారు. నియోజకవర్గంలోనీ అనేక సమస్యలపై గ్రీవెన్స్ డేలో అనేకమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నకాపర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోనీ భవనాలను నేలమట్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయడం చేతగాక దౌర్జన్యం చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులను అధికారులు, అధికార పార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
అధికారులు కాంగ్రెస్ పార్టీకి దత్తులుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారు. కలెక్టరేట్ దగ్గర ఉన్న బాధితులను చూస్తే రేవంత్ రెడ్డి పనితీరు కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారు.
పాలన చేతనవక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
అధికారుల దగ్గర పవర్ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవస్థను నడిపిస్తున్నారు.కాంగ్రెస్ నాయకులు పైరవీలు, లంచాలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.