Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rythu Bharosa : తొమ్మిది రోజుల్లోనే బరాబర్ రైతు భరోసా నిధుల జమ

–ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8284.66 కోట్లు
–రేపటి వరకు పూర్తి కానున్న రైతు భరోసా నిధుల విడుదల
–ఇంత తక్కువ రోజుల్లో పూర్తి కావ డం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం
–రేపు రైతునేస్తం కార్యక్రమంలో సీ ఎం రేవంత్ రెడ్డి
–రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Rythu Bharosa :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతుభరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ. 8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు, ఎకరాలతో సంబంధం లే కుండా సాగులో ఉన్న మిగతా భూ ములకు కూడా రైతుభరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తా మని మంత్రి అన్నారు. రైతుకు భ రోసా రేవంతన్న అనేలా ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకా లం రైతుభరోసా ప్రక్రియను పూర్తి చే సి, రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు.

జూన్ 16 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించు కున్న రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రో జు రెండు ఎకరాల వరకు 2349.83 కోట్లు, రెండో రోజు 3 ఎకరాల వరకు 3901.73 కోట్లు, మూడో రోజు 4 ఎ కరాల వరకు 5215.26 కోట్లు, నా లుగో రోజు 5 ఎకరాల వరకు 640 4.70 ఎకరాలు, ఐదో రోజు 7 ఎకరా ల వరకు 7310.59 కోట్లు, ఆరో రో జు 9 ఎకరాల వరకు 7770.83 కో ట్లు, ఏడో రోజు 15 ఎకరాల వరకు 8284.66 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.

ఇంత తక్కువ రోజుల్లోనే రైతుభరో సా నిధుల జమ ప్రక్రియను పూర్తి చే యడం రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారి అని, రాష్ట్ర ఆర్థిక ప రిస్థితి బాగోలేకున్న కూడా రైతు సం క్షేమంలో ఎలాంటి రాజీ పడకుండా వానాకాలం రైతుభరోసా పథకాన్ని పూర్తిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్ర త్యేక కృతజ్ఙతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందంలో ము నిగిపోయారని, ఇంతకు ముందు 2 నుండి 4 నెలల సమయం పట్టేదని, కాని రేవంత్ ప్రభుత్వం కేవలం 9 రో జులలోనే పూర్తి చేసిందని రైతులు హర్హాతిరేకం వ్యక్తం చేస్తున్నారన్నా రు.

ఇంతకుముందు రైతు రుణమాఫి కూ డా చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోగా పూర్తి చేశామని ఈ సందర్భం గా మంత్రి గుర్తుచేశారు. అంతేకా కుండా దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా సన్నలకు మద్ధతు ధరపై 500 బోనస్ ప్రకటించడం జ రిగిందని, తద్వారా అదనంగా 2 వేల కోట్లకు పైగా రైతులు లబ్ధి పొం దారన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్న, కొనకపోయినా మార్క్ ఫెడ్ ద్వారా పండిన ప్రతి పంటను తమ ప్రభు త్వం సేకరిస్తుందన్నారు. ఇది ఇంది రమ్మ రాజ్యం అని, ఇందిరమ్మ రా జ్యం అంటేనే రైతుల రాజ్యమని మ రోసారి మా ప్రభుత్వం రుజువు చే సిందని మంత్రి అన్నారు. రైతు భ రోసా ద్వారా అందుకున్న నిధులను రైతులు పంట పెట్టుబడులకు వా డుకొని, మంచి పంటలు పండించు కోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆ కాంక్షించారు.

ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఖ ర్చు చేసిందని, కానీ ఇవేమి కనబ ర్చాలనిడని ప్రతిపక్ష నాయకులు ప్ర భుత్వంపై విమర్శలు చేయడమే ల క్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటి కైనా మా ప్రభుత్వం రైతులకు చేస్తు న్న మంచిని గ్రహించి ధురుద్ధేశంతో చేసే విమర్శలు మానుకోవాలని, రై తులకు మేలు చేసే ఆలోచనలతో ముందుకురావాలని హితవు పలి కారు. రైతుల సంక్షేమమే మాకు తొ లి ప్రాధాన్యమని, అందుకనుగు ణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ప నిచేస్తున్నామన్నారు. రైతుల సం క్షేమం పట్ల మా ప్రభుత్వ వైఖరి చిత్త శుద్ధి ఏ మాత్రం మారదని మంత్రి తెలియజేశారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా రై తుభరోసా నిధులను ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే పూర్తి చేసిన సందర్భంగా, సెక్రటేరియట్ ఎదురు గా ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన రైతుపం డగ కార్యక్రమంలో సాయంత్రం 6 గంటలకు రైతులను ఉద్ధేశించి ము ఖ్యమంత్రివర్యులు మాట్లాడుతా రని మంత్రి తెలిపారు. ముఖ్యమం త్రికి కృతజ్ఙతపూర్వకంగా ప్రజా ప్రతి నిధులు రైతులతో కలిసి వారి వారి నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రా మాల్లో పెద్దఎత్తున పాల్గొని ఈ రై తుపండగ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు.