Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Stock Market: లాభాల బాటలో సక్సెస్ ఫుల్ గా సెన్సెక్స్

Stock Market: ప్రజా దీవెన, ముంబై : ఇండియా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో స క్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతు న్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం తో పాటు అనేక ఆటుపోట్ల నేప ద్యంలో వరుసగా ఐదు సెషన్లలో నాలుగు పర్యాయాలు స్టాక్ మార్కె ట్లు నష్టాలను చవిచూసిన క్రమంలో మంగళవారం మళ్లీ లాభాల బాట లో ప్రయాణం మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు సీజ్ ఫై ర్‌కు ఒప్పుకున్నాయంటూ అమెరి కా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రక టించిన నేపథ్యంలో దేశీయ మార్కె ట్‌లో జోష్ మళ్ళీ ఆరంభమైంది.

ఉదయం 10 గంటలకు సెన్సెక్స్‌ 724 పాయింట్ల లాభంతో 82,624 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.నిఫ్టీ ఏకంగా 233 పాయింట్లు లాభపడి 25,205 పాయింట్ల వద్ద ట్రేడ్ అవు తోంది. అదేవిధంగా గ్లోబల్ మార్కె ట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇంటర్ గ్లోబర్ ఏవియేషన్, భారత్ పెట్రోలి యం కార్పొరేషన్, ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, మహీంద్రా అండ్ మ హీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, బ్యాం క్ ఆఫ్ బరోడా, జియో ఫైనాన్స్ స ర్వీస్, ఎల్ అండ్ టీ, అదానీ గ్రీన్ ఎ నర్జీ, పంజాబ్ నేషన్ బ్యాంక్, డీఎల్ ఎఫ్ షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవు తున్నాయి. ఇక ఎన్టీపీసీ, హిందు స్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రా నిక్స్, అవెన్యూ సూపర్ మార్కెట్స్, హావెల్స్ ఇండియా, సైమెన్స్ ఎనర్జీ ఇండియా, వరుణ్ బేవరేజెస్ షేర్లు నష్టాల్లో పయనిస్తుoడడo గమనా ర్హం.