Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth reddy: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, వ్యవ సాయం దండుగ కాదు పండుగ

CM Revanth reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభ సాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభు త్వం రైతులకు అండగా నిలబడు తూనే ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రై తులను రాజులను చేయడమే ల క్ష్యంగా పని చేస్తామని పునరుద్ఘా టించారు.రైతు భరోసా కింద ఈ నె ల 16 వ తేదీన రైతు ఖాతాల్లోకి డ బ్బు వేయడం ప్రారంభించినప్పటి నుంచి చెప్పిన మాట ప్రకారం 9 రో జుల్లోగా 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తయిందని ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకు ని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసి న రైతు నేస్తం కార్యక్రమంలో ము ఖ్యమంత్రి పాల్గొన్నారు.

డాక్టర్ బీఆ ర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా రాష్ట్ర వ్యా ప్తంగా 16 వందల రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్షలాది రైతులు వీక్షించారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావుతో కలిసి పా ల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భం గా రైతులను ఉద్దేశించి మాట్లాడా రు. సీఎం ప్రసంగం యావత్తు ఆయ న మాటల్లోనే…

గతంలో చెప్పినట్టుగానే 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఎకరాకు 12 వేల చొప్పున 1 కోటి 40 లక్షల ఎక రాలకు 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తం గా సంబరాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా రైతులందరికీ అభినందనలు. రాష్ట్రంలో ప్రజా ప్ర భుత్వానికి రైతులు మొదటి ప్రాధా న్యత. ఆ తర్వాత క్రమంలో మహి ళలు, తెలంగాణ ఉద్యమకారులైన యువతకు ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే రైతు భరోసా కింద 7,6 25 కోట్ల రూపాయలను రైతుల ఖా తాల్లో జమ చేశాం. వచ్చే పదేండ్ల లో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రజా ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన వెం టనే రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు సంబంధించి 20,617 కో ట్ల రూపాయలు చెల్లించి రుణ వి ముక్తులను చేశాం. ధాన్యం సేకరిం చిన 48 గంటల్లోనే రైతుల ఖాతా ల్లో డబ్బు చెల్లించడమే కాకుండా స న్న వడ్లు పండించిన వారికి బోనస్ ఇస్తున్నాం. 2.80 కోట్ల మెట్రిక్ ట న్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశం లోనే అత్యధిక దిగుబడిని ఇచ్చి గర్వంగా చెప్పుకునే రాష్ట్రంగా తె లంగాణను నిలబెట్టారు.

రైతాంగానికి అండగా నిలబడాలన్న లక్ష్యంతోనే రుణ మాఫీ, రైతు భరో సా, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, స్ప్రింక్లర్స్, డ్రిప్, సోలార్ గి రి వికాసంలో పంపుసెట్లు, సివిల్ స ప్లయ్ విభాగం ద్వారా ధాన్యం కొను గోలు ఇలా కేవలం 18 నెలల కాలం లో వ్యవసాయ రంగంపై 1 లక్ష 04 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి న ప్రజా ప్రభుత్వం ఇది.

ప్రజా పాలనలో రైతులు, మహిళ లు, యువకుల కోసం అనేక కార్య క్రమాలు చేపడుతున్నాం. మహిళ లకు ఉచిత బస్సు ప్రయాణం, సో లార్ పవర్ ప్లాంట్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, స్కూలు పి ల్లల యూనిఫామ్ కుట్టించే బాధ్యత అప్పగించడం, స్వయం సహాయ సంఘాలకు సహాయం ఇలా కోటి మంది కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేప ట్టాం.

అధికారం చేపట్టిన తర్వాత దేశం లో ఏ రాష్ట్రం చేయని విధంగా మొ దటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం ద్వారా యువకులను ఆదుకునే ప్ర ణాళికలతో ముందుకు వస్తాం. త దుపరి కార్యక్రమంగా రాజీవ్ యువ వికాసం చేపడుతాం. ప్రజా పాలన లో రైతులు, మహిళలు, యువకు లు భద్రంగా ఉండాలన్నదే మా ఆ కాంక్ష.గోదావరి, కృష్ణా జలాల్లో తె లంగాణ హక్కుల కోసం అన్ని రకా లుగా పోరాడుతాం. ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేం ద్రానికి ఫిర్యాదు చేశాం. ఒకవేళ కేంద్రం ప్రా జెక్టుకు అనుమతిస్తే న్యాయ స్థానా ల్లో పోరాడుతాం. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తె లిపి న అభ్యంతరాల విషయంలో అ సెంబ్లీలో చర్చకు సిద్ధమని ముఖ్య మంత్రి వివరించారు.ఈ కార్యక్రమం లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీని వాస రెడ్డి, ధనసరి అనసూయ సీత క్క, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగో పాల్ రావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు ఎంపీలు, ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వ్యవసా య శాఖ అధికారులు పాల్గొన్నారు.