–సమన్వయంతో పని చేస్తేనే సుసా ధ్యం
— మూడు, నాలుగు రోజుల్లో అత్య వసర బృందాలు
–సమీక్షా సమావేశంలో హైడ్రా కమి షనర్ రంగనాథ్
Hydra Commissioner Ranganath: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణ రాష్ట్రంలోని చెరువుల పూర్తిస్థా యి సామర్థ్యంపై సమగ్ర అధ్యయ నం చేసేందుకు రంగం సిద్ధమైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. చెరువుల నీటి మ ట్టంతో పాటు అందులోకి వచ్చే వర ద ప్రవాహం, అలుగులు, అ వుట్లె ట్ల ద్వారా దిగువకు వెళ్లే వర్షపు నీటి పై అధ్యయనం చేయాల్సిన అవస రముందని పేర్కొన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో రోడ్లపై వరద నీరు ఎక్కువ సేపు నిలవకుండా, వాహనాల రాకపోకలకు అంతరా యం కలగకుండా అన్ని విభాగాల తో సమన్వయం చేసుకోనున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ విభాగం అధికా రులతో ఆయన సమావేశమయ్యా రు.ఈ సందర్భంగా వరద నీరు నిలి చే ప్రాంతాలు, అక్కడి సమస్యలను అధికారులు వివరించారు. ట్రై కమి షనరేట్ల పరిధిలో 349 ప్రాంతాలు వరద ముంపు ఉన్నట్టు గుర్తించామ ని, ఆ ఏరియాలకు చెందిన సంబం ధిత శాఖ అధికారులు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ సమాచా రం ఇవ్వగానే అప్రమత్తంగా ఉండా లని రంగనాథ్ సూచించారు. మూ డు రోజుల్లో వర్షాకాల అత్యవసర బృందాలు అందుబాటులోకి వస్తా యని రంగనాథ్ పేర్కొన్నారు.
చెరువులు, నాలాల కబ్జాకు గురైతే 87124 06899 నెంబర్ ద్వారా హై డ్రాకు సమాచారమివ్వాలని హైడ్రా ప్రజలను కోరింది. 72079 23085 నెంబర్కు వివరాలు పంపి హైడ్రా క మిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీ సుకురావచ్చన్నారు. వరద నీరు నే రుగా చెరువుల్లోకి చేరేలా హైడ్రా చ ర్యలు తీసుకుంటోందని పౌరులూ సహకరించాలని కోరారు.