–తల్లిని చంపుతుంటే బిడ్డ కాప లాగా ప్రియుడితో కలిసి ఘాతుకం
–బాలికతో పాటు ఇద్దరు మైనర్లు అరెస్ట్
Planned Murder : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రేమగు డ్డిది అన్న నానుడి ఇదేనేమో ప్రేమ పేరుతో ముందస్తు పథకం ప్రకారమే ప్రేమించిన యువకుడితో కలిసి బా లిక తన తల్లిని హత్య చేసిందని సై బరాబాద్ జీడిమెట్ల పోలీసులు వెల్ల డించారు. ఈ మేరకు పోలీసులు జ రిపిన దర్యాప్తులో తేల్చారు. బుధ వారం హత్యకు పాల్పడిన కూతు రు ఆమె ప్రియుడు, అతని సోదరు డిని పోలీసులు అరెస్టు చేశారు. బా లానగర్ డీసీపీ సురేశ్ కుమార్ వివ రాల ప్రకారం జీడిమెట్ల పీఎస్ పరిధి న్యూఎల్బీనగర్ లో తన సోదరి స త్లా అంజలి అనుమానాస్పదంగా మరణించిందని, ఆమె గొంతును న లిమినట్లు గుర్తులు ఉన్నాయని ని న్న తంగలపల్లి శోభ ఫిర్యాదు చేసిం ది.
కేసు నమోద చేసి దర్యాప్తు ప్రా రం భించిన పోలీసులు అంజలి చిన్న కూతురిని విచారించగా తన అక్క (16) నల్లగొండ జిల్లా కట్టంగూర్ గ్రా మానికి చెందిన డీజే ఆపరేటర్ ప గిళ్ల శివతో ప్రేమ వ్యవహారం నడు స్తోందని, దీన్ని వ్యతిరేకించినందుకే అక్క తన ప్రియుడితో కలిసి కుట్ర చేసిందని తెలిపింది. కుట్రలో భాగం గా బాలిక ముందుగా తన చెల్లిని బ యటికి పంపించింది. తర్వాత శివ ను పిలువగా సోదరుడితో కలిసి వ చ్చిన అతడు వంటింట్లో ఉన్న అం జలి మెడకు నైలాన్ చున్నీతో బి గిం చి ఊపిరి ఆడకుండా చేసి తలపై కొ ట్టాడు. ఇది జరుగుతున్న సమ యంలో బాలిక ఎవరూ రాకుండా బయట కాపలాగా ఉంది. అంజలి మరణించిందా అని నిర్ధారించుకుని శివ, అతని సోదరుడు ఇంటికి తా ళం వేసి వెళ్లి పోయారు.వెళ్లేముందు బాలిక తన చెల్లిని ఈ విషయాన్ని ఎవరీకి చెప్పొద్దని బెదిరించింది. చి న్న కూతురు వెంటనే విషయాన్ని త న బంధువులకు చెప్పడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా కాగా 7వ తరగతి చదువుతున్న ప్పుడే బాలిక తన త ల్లి మీద ఫిర్యాదు చేసినట్టు డీసీపీ చెప్పారు. ఈ నెలలోనే అంజలి త న కూతురుపై మిస్సింగ్ కేసు పెట్టగా అంజలి, శివను పోలీసులు పట్టుకొ చ్చారు. ఈ క్రమంలోనే బాలిక తల్లి పై మరింత కోపాన్ని పెంచుకుంది. తనను అమ్మ కొడుతోందని, ఎలా గైనా తనను కాపాడాలని శివకు ఫో న్ చేసి చెప్పడంతో కుట్రకు ప్లాన్ చే సినట్టు తెలిసింది.