Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rare Surgery : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

–60 సంవత్సరాల మహిళ కడుపు లో నుండి 6 కిలోల కణితి తొలగిం పు
–శస్త్ర చికిత్సను విజయవంతం చేసి న డాక్టర్ల బృందాన్ని అభినందించిన ప ఆసుపత్రి సూపరింటిండెంట్

Rare Surgery : ప్రజా దీవెన నల్లగొండ:ఇటీవలే న ల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజ యవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందం బుధవారం మరో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహిం చారు.నల్గొండ జిల్లా పర్వేదుల గ్రా మానికి చెందిన 60 సంవత్సరాల మహిళ గత రెండు సంవత్సరాలు గా కడుపు నొప్పితో బాధపడుతు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానా స్పత్రికి వైద్యం నిమిత్తం వచ్చింది. ఆస్పత్రిలోని వైద్యులు ఆ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనం తరం ఆమె కడుపులో కణతి ఉన్న ట్లు గుర్తించారు. మహిళ కుటుంబ సభ్యుల సమ్మతితో బుధవారం ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆమ హి ళకు ఆపరేషన్ చేసి సుమారు 6 కిలోల బరువున్న 30×30 సెంటి మీటర్లు కలిగిన కణతిని తొల గించారు.

ఈ అరుదైన శాస్త్ర చికిత్సలో సర్జన్ల బృందం డాక్టర్ శ్రీకాంత్ వర్మ, డాక్టర్ నిఖిత ,డాక్టర్ వంశీ, డాక్టర్ దివ్య, అనస్తీషియా బృందం డాక్టర్ బద్రి నారాయణ ,డాక్టర్ నవీన్, డాక్టర్ సుధా, డాక్టర్ గిరి, డాక్టర్ శ్వేత లు సుమారు నాలుగైదు గంటల పాటు శ్రమించి ఈ కణతిని తొలగించారు.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుప త్రిలో అత్యంత అదునాతన వైద్య పరికరాలు ,వైద్య సదుపాయా లు,డాక్టర్లు ఉన్నందున ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించగలు గుతు న్నామని ప్రభుత్వ ప్రధాన ఆసుప త్రి సూపరింటిండెంట్ డాక్టర్ అరు ణకుమారి తెలిపారు. నల్గొండ ప్ర భుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇలాం టి అరుదైన శస్త్ర చికిత్సను విజయ వంతంగా చేసిన డాక్టర్ల బృందాన్ని ఆమె అభినందించారు.