NSS programme officer : ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రాం అధికారిగా అధ్యాపకులు డి శ్రీనివాసును నియమిస్తూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా మదిలేటి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ జాతీయ సేవ పథకం ద్వారా విద్యార్థులకు సేవా తత్పరతను అలవర్చి మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని, సేవ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సామాజిక అవగాహన పెంపొందించుకొని దేశ సేవకు పునర్ అంకితం అయ్యేలా తీర్చిదిద్దాలని సూచించారు.