Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rural Sanitation : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలి

Rural Sanitation : శాలిగౌరారం జూన్ 25:  వర్షాకాలం లో అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పక్కాగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని శాలిగౌరారం ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి కోరారు. బుధవారం శాలిగౌరారం మండల పరిషత్ కార్యాలయం లో గ్రామ పంచాయితీ కార్యదర్శులచే పారిశుధ్య నిర్వహణ పై సమీక్షా సమావేశం జరిగింది.

 

ఈ సందర్బంగా ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చేయాలని, బ్లీచింగ్ ఫౌడర్ ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచాలనన్నారు. మురికి కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కోరారు. నీటి వృధాను అరికట్టాలని, మొక్కలు విరివిగా నాటాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లను సత్వరమే నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీవో బత్తుల వెంకటేశ్వర్లు, ఉపాధి హామీ ఏపిఓ జంగమ్మ, హోసింగ్ ఏఈ యుగేందర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు నితిన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు