— నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ రమేష్ పిలుపు
State-Level Sports : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లా స్థాయి విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రావీణ్యం సంపాదించి రాష్ట్రస్థాయి క్రీడలలో గెలుపొంది భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని అదనపు ఎస్పీ రమే ష్ పిలుపునిచ్చారు.
2025- 26 సంవత్సరానికి గాను తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతిలో ప్రవేశానికై మండల, జిల్లా,రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తున్న విద్యార్థుల ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 24, 25 న రెండు రోజులపాటు నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.
ఈ ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 24 న బాలికలకు, 25 న బాలురకు ఎంపికలు నిర్వహించారు.
బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి అదనపు ఎస్పీ రమేష్ హాజరై మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఎంపికై మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు.
ఈ పోటీలలో సుమారు 20 మంది బాలికలు ,మండల స్థాయి నుంచి ఎంపికైన 45 మంది విద్యార్థులు హాజరయ్యారు .
ఈ కార్యక్రమానికి సాట్స్ అబ్జర్వర్ గా రామకృష్ణ వ్యవహరించగా, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మహ్మద్ అక్బర్ అలీ, విద్య, తదితర శాఖల సిబ్బంది హాజరయ్యారు.