— డ్రగ్స్ రహిత సమాజం ప్రభుత్వ లక్ష్యం
–మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని హితవు
–మాదక ద్రవ్యాల వ్యతిరేక వారో త్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komati reddy Venkata reddy : ప్రజా దీవెన, నల్లగొండ: భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రాష్ట్ర రో డ్లు భవనాలు సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వి ద్యార్థులకు సూచించారు. గురువా రం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టి న మాదక ద్రవ్యాల వ్యతిరేక వారో త్సవంలో భాగంగా ఎన్ జి కళా శాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వ హించిన ర్యాలీని ఆయన ఎన్ జి కళాశాల వద్ద జెండా ఊపి ప్రారం భించారు.ర్యాలీ క్లాక్ టవర్ చేరు కున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లా డారు. కరోనా తర్వాత డ్రగ్స్ వాడ కం పెరిగిందని, స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, తె లంగాణలో డ్రగ్స్ అన్నదే ఉండరా దని, విద్యార్థుల కోసం స్కిల్ యూ నివర్సిటీ కట్టిస్తున్నామని ,ఇందులో భాగంగా నల్గొండలో 34 కోట్లతో స్కి ల్ సెంటర్ కట్టిస్తున్నామన్నారు. త్వ రలోనే సిఎంతో దీనిని ప్రారంభిస్తా మని, డ్రగ్స్ వాడే వారిని తరిమికొ ట్టాలని,విద్యార్థులకు లైఫ్ టర్నింగ్ టైం అని,20 ఏండ్ల వరకు చదువు, స్పోర్ట్స్,యోగ పై దృష్టిపెట్టాలని కో రారు.
విద్యార్థులు,యువత సెల్ ఫోన్ కు దూరంగా ఉందాలని, అవసరమై తేనేవాడాలని,చదువుపైనే దృష్టి పె ట్టాలని చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు పొందాలని, ప్రకాశం బ జార్ లో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో పాఠశాల నిర్మిస్తున్నామని, డిజిటల్ తరగతుల తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉందాలని, విద్యార్థులకు ఎం కావాలన్న ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మంత్రిగా సహకారం అంది స్తామన్నారు. డ్రగ్స్ కువ్యతిరేకంగా చురుకుగా ఉండాలని,హైద్రాబాద్ లో డ్రగ్స్ పై కఠిన చర్యలుతీసుకొం టున్నామని ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడు తూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ మిషన్ పరివర్తన కింద వారం రోజులపాటు మాదక ద్రవ్యాల వ్య తిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని తెలిపారు. యువత ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే బానిసలు అవు తారని, అందువల్ల తీసుకోవద్దని, డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధంలో అంద రూ భాగస్వాములు కావాలని, డ్ర గ్స్ గురించి ఏదైనా సమాచారం అం దితే డయల్ 100 కు ఫోన్ చేయాల ని ,డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతాయని అన్నారు.నల్గొండ జిల్లా ను డ్రగ్స్ రహిత జిల్లా చేద్దామ ని పిలుపునిచ్చారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీని వాస్, మాట్లాడుతూ మాదక ద్రవ్యా ల నిర్మూలనలో అందరూ భాగస్వా ములు కావాలని, డ్రగ్స్ వాడడం చట్టరీత్య నేరమని, విద్యార్థులు డ్ర గ్స్ బారిన పడవద్దనికోరారు. మి ర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆదనపు ఎస్పీ రమేష్, డి డబ్ల్యుఓ కృష్ణవేణి, మాజీ మున్సిప ల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.డి ఈ ఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి,ఎస్ పిలు కార్యక్రమంలో పాల్గొన్న వారి తో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.