Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BjpGoliMadhusudhanReddy: అమ్మపేరిట మొక్కనాటిన బిజెపి నేత

**గోలి మధుసూదన్ రెడ్డి**

BjpGoliMadhusudhanReddy :ప్రజా దీవెన, నల్గొండ టౌన్:గ్యార సాల్ కా వికసిత్ భారత్ సంకల్పంలో బాగంగా అమ్మ పేరిట బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి మొక్క నాటారు. నల్గొండ పట్టణంలోని 18 వార్డులో 153 బూత్ అధ్యక్షురాలు మారగోని సుకేశినీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోలి మధుసూదన్ రెడ్డి అమ్మ పేరిట ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని సూచించారు..

ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా మూడవ సారి అధికారం చేపట్టి పదకొండు సంవత్సరాల అవుతుంది ఈ పదకొండు సంవత్సరాల పాలన అత్భుతంగా వుందని మధుసూదన్ రెడ్డి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కొనియాడారు.

దేశ వ్యాప్తంగా యన్ డి ఎ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృధి కొరకు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అని వారు తెలి పాయి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటే శం,పట్టణ ప్రధాన కార్యదర్శి మంగళపల్లి కిషన్,నాయకులు నంది కొండ వివేక్,రత్నమాల, అనురాధ,అరుణ,రాజేశ్వరి, సింధుజ, వెంకటనర్సమ్మ,తదితరులు పాల్గొన్నారు..